రామప్ప
దేవాలయము
ఓరుగల్లు
నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర
రాజధానియైన హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల
రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర
ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం
జరుగుతుంది. ఇది వరంగల్లు జిల్లాలో
చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ
దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే
రామప్ప సరస్సు కలదు. ఆ చెరువు
కాకతీయుల కాలం నాటిది ఇది
ఇప్పటికి వేల ఎకరాల పంటలకు
అధారంగా ఉన్నది. పాలంపేట చారిత్రత్మాక గ్రామము కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది.
కాకతీయ రాజు గణపతి దేవుడు
ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల
రుద్రయ్య నిర్మించాడు
చరిత్ర
మరియు వర్ణన
ఈ దేవాలయాన్ని క్రీస్తు
శకం 1213లో గణపతి దేవుని
కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో
ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన
ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం
ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని
పేరు కూడా కలిపి రామలింగేశ్వర
ఆలయం అని కూడా వ్యవహరిస్తారు.
ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. విష్ణువు
ఆవతారము రాముడు మరియు శివుడు కలిసి
ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము.ఈ
ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన
పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ
ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ
ద్వారము గల మహామండపం కలిగి
ఉన్నది. ఇందలి గర్భాలయమున ఎత్తైన
పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము కలదు.
ఇందలి మహామండపము మధ్య భాగమున కల
కుడ్య స్థంభములు, వాటిపై గల రాతి దూలములు
రామాయణ, పురాణ, ఇతిహాస గాధలతో కూడిన నిండైన అతి
రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నవి. ఈ
మహా మండపము వెలుపలి అంచున పై కప్పు
క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ
భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణలో
ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర,
కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి. దేవాలయము శిల్ప సంపద కాకతీయ
రాజుల నాటి శిల్ప శైలి
తెలుపుతున్నది.దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి
మీద తేలే అంత తేలికైనవి
అని చెబుతారు.ఇక్కడ ఆలయానికి ఎదురుగా
ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది.
ఒక కాలు కొంచెం పైకి
ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ
దిశనుంచి చూసినా నంది మన వైపే
చూస్తున్నట్లుంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న
స్థంబాల మీద అత్యంత రమణీయమైన
శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద
శిలకళాసౌందర్యము చాలా అద్భుతంగా ఉంటుంది.
లోపల రెండు శివుని సన్నిధులు
ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది
చాలా ఆందముగా చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్నది. ఈ గుడి తరచు
జరిగిన దండయాత్రల బారికి గురైనది. 17వ శతాబ్ధములో వచ్చిన
భూకంపము వలన కొద్దిగా శిధిలము
అయ్యింది. ఆలయ ముఖ ద్వారము
శిధిలమైపోయింది. నటరాజ రామకృష్ణ పేరిణి
శివతాండవం అను నృత్య రీతిని
ఈ శిల్పాల నుండి గ్రహించి కంపోజ్
చేశారు.
ప్రస్తుతం
ఈ దేవాలయం ఎన్నో
యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణం లో చిన్న కట్టడాలను
నిర్లక్ష్యంగా వదలి వేయడం వలన
అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి.కొంత మంది ఇక్కుడున్న
నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని
వెళ్ళిపోవడం ప్రారంభించారు. అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇపుడు
తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా
శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు
పడమర వైపు ఉన్న చిన్న
ద్వారం ద్వారానే ప్రవేశం మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుపుతారు
ముద్దుగుమ్మల
మద్దెల ధ్వనులు
పాలంపేటలోని రామప్ప చెరువు కట్ట తూర్పు చివరనున్న
దేవాలయంలోపలి భాగంలో స్త్రీలు మద్దెల వాయిస్తూ వుండగా, వివిద భంగిమలలో నృత్యం
చేస్తున్న అనేక మంది ఆటకత్తెల
శిల్పాలున్నాయి. అదే దేవాలయం పడమటి
వైపు ద్వార బంధాలమీద మార్థంగికురాండ్ర
శిల్పాలున్నాయి. వరంగల్లు రుద్రమదేవి కోట ద్వారబంధంపై రాతి
పలక మీద మార్థంగికురాండ్ర శిల్పాలు
చెక్కబడి వున్నాయి.ఆ కోటలోనే స్వంభూ
దేవాలయలో ఒక చిన్న శివ
తాండవ నృత్య శిల్పముంది. హనుమ
కొండ వెయ్యి స్థంభాల గర్బగుడి ద్వార బంధాలమీడ వివిధ
నాట్యాల నృత్య భంగిమలలో స్త్రీల
శిల్పాలున్నాయి. రెండవ ఆద్యాయం అంగనిరూపణ.,.
మూడవ ఆద్యాయం, మండల లక్షణం, నాలుగవ
ఆద్యాయం, కరణాంగ హార వివేచానికి సంబందించినది.
ఐదవ ఆద్యాయం దేశి, స్థానక, కరణ,
భ్రమరీ లక్షణాలను తెలుపుతూ వుంది. ఆరవ ఆధ్యాయం దేశ
పాట, చారీలాస్యాంగగతి లక్షణమనే పేరు గలది. 6--7--8 ఆద్యాయాలు
ఆ నాటీ ఆంధ్రదేశంలో వాడుకలో
వున్న దేసి, నృత్తపద్దతులన్ని వివరించేవిగా
వుండి గ్రంథ ప్రాముఖ్యాన్ని ఎంతగానో
చాటుతున్నాయి.జాయన నృత్తరత్నావళిలో తన
కాలంలో ప్రచారంలో వున్న దేశీ నృత్యాలన్నింటినీ
అమూలంగా చిత్రింఛాడు. ఎనిమిది ఆధ్యాయాలు గల ఈ గ్రంథంలో
కడపటి మూడు ఆద్యాలూ దేశి
నృత్య సాంప్రదాయాలైన వేరణి, ప్రేంఖణం, రాసకం, చర్చరి, నాట్య రాచకం, దండ
రాచకం, శివప్రియం, చిందు, కందుకం, ఖాడిక్కం, ఘంటనరి, చరణము, బహురూపం, కోలాటం, మొదలైన ప్రాంతీయము లైన అనేఅ ఆనపద
నృత్యాలను వివరించాడ్రు. జాయన నృత్తరాత్నావళిని పరికించి
చూస్తే భరతముని ప్రసాదించిన భరత నాట్యశాస్త్ర గ్రంథంలోనూ,
భరత నాట్యంపై ఆభినవ గుప్తాచార్యుల వ్యాఖ్యానం
తోనూ జాయనకు పరిపూర్ణ పరిచయం వున్నట్లు తోస్తూవుందని క్రీ.శే. మల్లంపల్లి
వారు అదే వ్వాసంలో వ్రాశారు.
జాయన నృత్యరత్నావళిలో నృత్యానికి అనుగుణమైన సంగీత రత్నావళిని గూడ
అనుబంధంగా అరచించాడట. కాని దురదృష్ట వశాత్తూ
అది లభ్యం కాకుండా పోయింది.
జాయన 1213 వ సంవత్సరం నాటికే
సాల నాట్య వైదికమణి అనీ,
కవి సభాశిఖామణి అనీ పేరొందాడు. జాయన
నృత్తరత్నావళిని 1253 --
54 నాటికి రచిందడం వలన దాదాపు 60 సంవత్సరాల
వయసులో వ్రాసి వుండ వచ్చు. ఏమైనా
ఈ నాడు ఆంథ్రుల గర్వించగగిన
పురాతన నృత్యశాస్త్ర గ్రంథాలలో నృత్తరత్నావళి మణి భూషణం.
శిల్ప
కళా చాతుర్యం
రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర
కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచనలవికానివి.
ఈ కాకతీయ శిల్పచాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూఫరులకు
అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా
మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది.రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా
దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య
కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ
విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య
భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య
భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి
వున్నాయి. జాయన సేనాని రచించిన
నృత్తరత్నావళిలో ఉదాహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ వుంది.
- బ్రాహ్మణ సేవా
సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment