వరంగల్ కోట
వరంగల్ దుర్గం గా ప్రసిద్ధిచెందిన ఓరుగల్లు కోట చరిత్ర 13వ శతాబ్ధము నుండి ఉన్నది. ఓరుగల్లు కోట వరంగల్ రైలుస్టేషనుకు 2 కి.మీ. దూరంలోనూ, హనుమకొండ నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది. ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి. కోట కీర్తి తోరణాలు ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక చిహ్నంగా వాడుకలో ఉన్నాయి
చరిత్ర
ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199వ సంవత్సరంలో ప్రారంభించగా, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి 1261 వ సంవత్సరంలో పూర్తి చేసారు. ఒరుగల్లును కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు (1323-1331), ముసునూరి నాయకులు (1331-1368), రేచెర్ల నాయకులు (1368-1424), బహమనీ సుల్తానులు (1424-1504), భోగికుల సితాబ్ ఖాన్ (1504-1529), గొల్లకొండ కుతుబ్ షాహీలు (1579-1687) పాలించారు
కోట
చరిత్ర ప్రకారం ఈ కోటకు మూడు ప్రాకారాలు ఉన్నాయి, ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికి కూడా చూడవచ్చు. మెదటి ప్రాకారాన్ని ధరణి కోట అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవ ప్రాకారములో ఉన్న రాతికోట గ్రానైటు రాళ్ళతో నిర్మితమైనది. రాతి కోటకు పెద్దపెద్ద ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులు ఉండి ఏకశిలానిర్మితమైనవి. ప్రతిప్రాకారానికి వెలుపల పెడల్పాటి, లోతైన కందకాలున్నాయి. కోట ద్వారం మీద కీర్తి తోరణాలు ఉన్నాయి. ఇలాంటి నాలుగు ద్వారాలతో ఈ కోట 19 చదరపు కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి శోభిల్లుతూ ఉండేది
స్వయంభూశివాలయం
కాకతీయ చక్రవర్తులకు స్వయంభూశివాలయం చాల ప్రాముఖ్యతతో కూడినది. ప్రతాపరుద్ర చరిత్రము లో ఏకామ్రనాథుడు ఓరుగల్లులో జ్యోతిర్మయంబగు స్వర్ణలింగం ఉద్భవించినట్లు వ్రాశాడు. మరియు అద్దేవుండు మధ్యప్రదేశంబుననుండునట్లుగా గొలిచి యోజన విస్తారంబుగా పురంబు గట్టదలచి .....ఓరుగల్లు పట్టణంబు గట్టిరి. స్వయంభూశివాలయం కోట మధ్యలో నిర్మించబడి ఉన్నది. ఖండములై పడివున్న చతుర్ముఖలింగము ఆలయములో మూలవిరాట్. ఆలయ ప్రాకారమునకు వెలుపల నాలుగు దిశలా నాలుగు కీర్తి తోరణములున్నాయి. ఆలయను పూర్తిగా ధ్వంసము చేసిన తురుష్కులు తోరణములను మాత్రము విడిచిపెట్టారు.
పతనము
క్రీ. శ. 1296లో దేవగిరి స్వాధీనము తరువాత తుగ్లక్ సుల్తానుల కన్ను ఆంధ్రదేశముపై బడింది. సంపదతో తులతూగుతున్న ఓరుగల్లు వారి అసూయాద్వేషాలకు కారణమయింది.
మొదటి ముట్టడి
క్రీ. శ. 1310లో మాలిక్ కాఫుర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టిగోడను ధ్వంసం చేశాడు. లోపలి రాతిగోడను ఛేదించలేక కోట బయటి గ్రామాలను నాశనము చేసి అమాయక ప్రజలను వధించుట మొదలుపెట్టగా ప్రతాపరుద్రుడు సంధిచేసుకొని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, 100 ఏనుగులు, కోహినూరు వజ్రము అప్పగించాడు[2].
రెండవ ముట్టడి
1321లో ఘియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుఘ్ ఖాన్ (మహమ్మద్ బీన్ తుగ్లక్)ను ఓరుగంటిపై దాడికి పంపుతాడు. వీరోచితముగా పోరాడిన ప్రతాపరుద్రుని సైన్యము ధాటికి తట్టుకోలేక, మరియు ఆ సమయములో వ్యాపించిన మహమ్మారి వల్లనూ, ఆరు నెలల ముట్టడి తర్వాత ఉలుఘ్ ఖాన్ వెనుతిరుగుతాడు.
మూడవ ముట్టడి
ఉలుఘ్ ఖాన్ రెట్టించిన ఉత్సాహముతో, బలీయమైన సైన్యముతో 1323లో మరలా దాడికి వచ్చాడు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యముగా సుల్తాను సేనలనెదుర్కొంటాడు. తుర్క్ సేనలుపయోగించిన ఆధునిక పద్ధతులవల్ల, బలీయమైన అశ్వికదళము వల్ల, తెలుగు నాయకుల అనైక్యత వల్లనూ, పరాజయము తప్పలేదు. ప్రతాపరుద్రుడు, కటక పాలుడు గన్నమ నాయుడు బందీలవుతారు. వారిని ఢిల్లీ తరలిస్తుండగా మహారాజు నర్మదా నదిలో మునిగి ఆత్మార్పణం చేసుకుంటాడు. ఢిల్లీలో గన్నమ నాయుడు (మాలిక్ మక్బూల్) ఇస్లాము మతములోనికి మార్చబడ్డాడు. ఉలుఘ్ ఖాను ఓరుగల్లును దౌలతాబాదు అధిపతిగానున్న మాలిక్ బుర్హానుద్దీను ఆధీనములో ఉంచి ఢిల్లీకి మరలుతాడు.
సుల్తానుల పాలన
ఓరుగంటి పేరు సుల్తాన్ పూర్ అని మార్చబడింది. స్వయంభూశివాలయము పూర్తిగా ధ్వంసం చేయబడింది. ప్రాకారము, గర్భగుడి, అస్థాన మండపము నేలమట్టము చేయబడ్డాయి. కోట కేంద్రస్థానములో మూడు కట్టడాలు నిర్మించబడ్డాయి. ఇవి ఖుష్ మహల్, జామీ మసీదు, . ఈ కట్టడాలకు గుడి రాళ్ళు, స్థంభాలు విరివిగా వాడబడ్డాయి. తోరణాలు మాత్రము వదిలివేయబడ్డాయి.
ఖుష్ మహల్
ఇది 38x17.5 మీటర్ల కొలతలతో ఆరు మీటర్ల మందముగల గోడలతో కట్టబడిన పొడవాటి కొలువు కూటమి హాలు. తుగ్లకాబాద్ కోటలోనున్న ఘియాసుద్దీన్ తుగ్లక్ మహలులోని 'దివాన్-ఏ-ఆమ్'ను అనుసరించి ఖుష్ మహల్ కట్టబడింది. ఇది మధ్య ఆసియా దేశములలో 'ఐవాన్' పారశీక పద్ధతిలో కట్టబడిన భవంతి. కమానులు గుర్రపు నాడా ఆకారములో ఉంటాయి. 14వ శతాబ్దపు సుల్తానుల కాలములో కట్టబడి ఇప్పటికీ మంచి స్థితిలోనున్న కొలువు కూటమి ఖుష్ మహలు.
జామి మసీదు
ఖుష్ మహలు వలె కాకుండా పూర్తిగా శిధిలావస్థలోనున్న కట్టడము జామి మసీదు. ప్రస్తుతము మిగిలిఉన్నది ఐదు స్థంభములు, వాటిపైనున్న దూలాలు, కొంత లోకప్పు మాత్రమే. ఈ స్థంభాలు స్వయంభూ శివాలయములోని మండపము భాగాలు. మసీదు 1323-1331 సంవత్సరముల మధ్య ఓరుగల్లు తుఘ్లక్ ఆధీనతలోనున్న సమయములో కట్టబడింది. ఇది విజయసూచిక మసీదు. అనగా శత్రువులను జయించిన తరువాత వారి మతసంబంధిత కట్టడములపై నిర్మించు మసీదు. ఇందు చతురస్రములో పొదిగిన అష్టకోణము అకారములోనుండు గవాక్షములుంటాయి. జామి మసీదులోని పదిహేను మీటర్ల పొడవుగల గుమ్మటపు గవాక్షము సుల్తానుల కాలపు మసీదులన్నింటిలో పెద్దది.
కాకతీయ పాలకులు
కాకతి వెన్నయ
750-768
మొదటి గుండయ
769-824
రెండవ గుండయ
825-870
మూడవ గుండయ
870-895
ఎఱ్ఱయ
896-925
మొదటి బేతరాజు
946-955
నాల్గవ గుండయ
956-995
గరుడ బేతరాజు
996-1051
మొదటి ప్రోలరాజు
1052-1076
రెండవ బేతరాజు
1076-1108
దుర్గరాజు
1108-1115
రెండవ ప్రోలరాజు
1116-1157
గణపతి దేవుడు
1199-1262
రుద్రమ దేవి‡
1262-1289
ప్రతాపరుద్రుడు
1289-1323
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ శాఖ
వరంగల్ దుర్గం గా ప్రసిద్ధిచెందిన ఓరుగల్లు కోట చరిత్ర 13వ శతాబ్ధము నుండి ఉన్నది. ఓరుగల్లు కోట వరంగల్ రైలుస్టేషనుకు 2 కి.మీ. దూరంలోనూ, హనుమకొండ నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది. ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి. కోట కీర్తి తోరణాలు ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక చిహ్నంగా వాడుకలో ఉన్నాయి
చరిత్ర
ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199వ సంవత్సరంలో ప్రారంభించగా, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి 1261 వ సంవత్సరంలో పూర్తి చేసారు. ఒరుగల్లును కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు (1323-1331), ముసునూరి నాయకులు (1331-1368), రేచెర్ల నాయకులు (1368-1424), బహమనీ సుల్తానులు (1424-1504), భోగికుల సితాబ్ ఖాన్ (1504-1529), గొల్లకొండ కుతుబ్ షాహీలు (1579-1687) పాలించారు
కోట
చరిత్ర ప్రకారం ఈ కోటకు మూడు ప్రాకారాలు ఉన్నాయి, ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికి కూడా చూడవచ్చు. మెదటి ప్రాకారాన్ని ధరణి కోట అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవ ప్రాకారములో ఉన్న రాతికోట గ్రానైటు రాళ్ళతో నిర్మితమైనది. రాతి కోటకు పెద్దపెద్ద ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులు ఉండి ఏకశిలానిర్మితమైనవి. ప్రతిప్రాకారానికి వెలుపల పెడల్పాటి, లోతైన కందకాలున్నాయి. కోట ద్వారం మీద కీర్తి తోరణాలు ఉన్నాయి. ఇలాంటి నాలుగు ద్వారాలతో ఈ కోట 19 చదరపు కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి శోభిల్లుతూ ఉండేది
స్వయంభూశివాలయం
కాకతీయ చక్రవర్తులకు స్వయంభూశివాలయం చాల ప్రాముఖ్యతతో కూడినది. ప్రతాపరుద్ర చరిత్రము లో ఏకామ్రనాథుడు ఓరుగల్లులో జ్యోతిర్మయంబగు స్వర్ణలింగం ఉద్భవించినట్లు వ్రాశాడు. మరియు అద్దేవుండు మధ్యప్రదేశంబుననుండునట్లుగా గొలిచి యోజన విస్తారంబుగా పురంబు గట్టదలచి .....ఓరుగల్లు పట్టణంబు గట్టిరి. స్వయంభూశివాలయం కోట మధ్యలో నిర్మించబడి ఉన్నది. ఖండములై పడివున్న చతుర్ముఖలింగము ఆలయములో మూలవిరాట్. ఆలయ ప్రాకారమునకు వెలుపల నాలుగు దిశలా నాలుగు కీర్తి తోరణములున్నాయి. ఆలయను పూర్తిగా ధ్వంసము చేసిన తురుష్కులు తోరణములను మాత్రము విడిచిపెట్టారు.
పతనము
క్రీ. శ. 1296లో దేవగిరి స్వాధీనము తరువాత తుగ్లక్ సుల్తానుల కన్ను ఆంధ్రదేశముపై బడింది. సంపదతో తులతూగుతున్న ఓరుగల్లు వారి అసూయాద్వేషాలకు కారణమయింది.
మొదటి ముట్టడి
క్రీ. శ. 1310లో మాలిక్ కాఫుర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టిగోడను ధ్వంసం చేశాడు. లోపలి రాతిగోడను ఛేదించలేక కోట బయటి గ్రామాలను నాశనము చేసి అమాయక ప్రజలను వధించుట మొదలుపెట్టగా ప్రతాపరుద్రుడు సంధిచేసుకొని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, 100 ఏనుగులు, కోహినూరు వజ్రము అప్పగించాడు[2].
రెండవ ముట్టడి
1321లో ఘియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుఘ్ ఖాన్ (మహమ్మద్ బీన్ తుగ్లక్)ను ఓరుగంటిపై దాడికి పంపుతాడు. వీరోచితముగా పోరాడిన ప్రతాపరుద్రుని సైన్యము ధాటికి తట్టుకోలేక, మరియు ఆ సమయములో వ్యాపించిన మహమ్మారి వల్లనూ, ఆరు నెలల ముట్టడి తర్వాత ఉలుఘ్ ఖాన్ వెనుతిరుగుతాడు.
మూడవ ముట్టడి
ఉలుఘ్ ఖాన్ రెట్టించిన ఉత్సాహముతో, బలీయమైన సైన్యముతో 1323లో మరలా దాడికి వచ్చాడు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యముగా సుల్తాను సేనలనెదుర్కొంటాడు. తుర్క్ సేనలుపయోగించిన ఆధునిక పద్ధతులవల్ల, బలీయమైన అశ్వికదళము వల్ల, తెలుగు నాయకుల అనైక్యత వల్లనూ, పరాజయము తప్పలేదు. ప్రతాపరుద్రుడు, కటక పాలుడు గన్నమ నాయుడు బందీలవుతారు. వారిని ఢిల్లీ తరలిస్తుండగా మహారాజు నర్మదా నదిలో మునిగి ఆత్మార్పణం చేసుకుంటాడు. ఢిల్లీలో గన్నమ నాయుడు (మాలిక్ మక్బూల్) ఇస్లాము మతములోనికి మార్చబడ్డాడు. ఉలుఘ్ ఖాను ఓరుగల్లును దౌలతాబాదు అధిపతిగానున్న మాలిక్ బుర్హానుద్దీను ఆధీనములో ఉంచి ఢిల్లీకి మరలుతాడు.
సుల్తానుల పాలన
ఓరుగంటి పేరు సుల్తాన్ పూర్ అని మార్చబడింది. స్వయంభూశివాలయము పూర్తిగా ధ్వంసం చేయబడింది. ప్రాకారము, గర్భగుడి, అస్థాన మండపము నేలమట్టము చేయబడ్డాయి. కోట కేంద్రస్థానములో మూడు కట్టడాలు నిర్మించబడ్డాయి. ఇవి ఖుష్ మహల్, జామీ మసీదు, . ఈ కట్టడాలకు గుడి రాళ్ళు, స్థంభాలు విరివిగా వాడబడ్డాయి. తోరణాలు మాత్రము వదిలివేయబడ్డాయి.
ఖుష్ మహల్
ఇది 38x17.5 మీటర్ల కొలతలతో ఆరు మీటర్ల మందముగల గోడలతో కట్టబడిన పొడవాటి కొలువు కూటమి హాలు. తుగ్లకాబాద్ కోటలోనున్న ఘియాసుద్దీన్ తుగ్లక్ మహలులోని 'దివాన్-ఏ-ఆమ్'ను అనుసరించి ఖుష్ మహల్ కట్టబడింది. ఇది మధ్య ఆసియా దేశములలో 'ఐవాన్' పారశీక పద్ధతిలో కట్టబడిన భవంతి. కమానులు గుర్రపు నాడా ఆకారములో ఉంటాయి. 14వ శతాబ్దపు సుల్తానుల కాలములో కట్టబడి ఇప్పటికీ మంచి స్థితిలోనున్న కొలువు కూటమి ఖుష్ మహలు.
జామి మసీదు
ఖుష్ మహలు వలె కాకుండా పూర్తిగా శిధిలావస్థలోనున్న కట్టడము జామి మసీదు. ప్రస్తుతము మిగిలిఉన్నది ఐదు స్థంభములు, వాటిపైనున్న దూలాలు, కొంత లోకప్పు మాత్రమే. ఈ స్థంభాలు స్వయంభూ శివాలయములోని మండపము భాగాలు. మసీదు 1323-1331 సంవత్సరముల మధ్య ఓరుగల్లు తుఘ్లక్ ఆధీనతలోనున్న సమయములో కట్టబడింది. ఇది విజయసూచిక మసీదు. అనగా శత్రువులను జయించిన తరువాత వారి మతసంబంధిత కట్టడములపై నిర్మించు మసీదు. ఇందు చతురస్రములో పొదిగిన అష్టకోణము అకారములోనుండు గవాక్షములుంటాయి. జామి మసీదులోని పదిహేను మీటర్ల పొడవుగల గుమ్మటపు గవాక్షము సుల్తానుల కాలపు మసీదులన్నింటిలో పెద్దది.
కాకతీయ పాలకులు
కాకతి వెన్నయ
750-768
మొదటి గుండయ
769-824
రెండవ గుండయ
825-870
మూడవ గుండయ
870-895
ఎఱ్ఱయ
896-925
మొదటి బేతరాజు
946-955
నాల్గవ గుండయ
956-995
గరుడ బేతరాజు
996-1051
మొదటి ప్రోలరాజు
1052-1076
రెండవ బేతరాజు
1076-1108
దుర్గరాజు
1108-1115
రెండవ ప్రోలరాజు
1116-1157
గణపతి దేవుడు
1199-1262
రుద్రమ దేవి‡
1262-1289
ప్రతాపరుద్రుడు
1289-1323
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment