Monday, 18 April 2016

మహావీర్ జయంతి

http://www.vipravanam.com/
అహింసను ప్రభోధించిన జైన మత ప్రచారకుడు , వర్ధమాన మహావీరుడి జయంతి ని ప్రతిసంవత్సరము చైత్ర మాసంలో ఘనముగా జరుపుకుంటారు . బీహార్ లో వైశాలి కి సమీపములో కుండ గ్రామము లో క్రీ.పూ. 599 లో క్షత్రియ కుటుంబములో సిద్దార్ధ మహారాజుకు , రాణి త్రిష లకు జన్మించిన మహావీరుడికి తల్లి దండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు . అల్లారుముద్దుగా పెరిగిన మహావీరుడు తల్లి దండ్రులు 28 ఏట మరణించారు , యశోధరను వివాహమాడి , కుమార్తెకు జన్మనిచ్చిన తరువాత 36 ఏట సన్యాసాన్ని స్వీకరించిన వర్ధమానుడు . 12 ఏళ్ళ పాటు తపస్సు చేసి మహావీరుడు గా జైనమత ప్రచారకుడయ్యాడు . అప్పటి కే జైన మతానికి 23 మంది తీర్ధంకరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే మతానికి సంబంధించిన వివరాలు వెలుగు చూశాయి . 32ఏళ్ళ పాటు అహింసా ధర్మము తో మాట ప్రచారం జరిపిన మహావీరుడు 72 ఏట మరణించారు .
వల్లూరి పవన్ కుమార్                        
-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ


No comments:

Post a Comment