Friday, 8 January 2016

సీఎం కేసీఆర్‌ ను కలిసిన అర్చక సమాఖ్య, బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు

http://www.vipravanam.com/
     గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారు వరంగల్ ప్రర్యటనలో భాగంగా తేది 06-01-2016 రోజున శ్రీ కొండా మురళీధర్ రావు గారి ఇంటికి భోజన విరామంలో వచ్చిన సందర్బంగా  బ్రాహ్మణ సంఘం నాయకులు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ గతంలో బ్రాహ్మణ భవనంనకు కేటాయించిన 10 కోట్ల రూపాయలకు సంభందించిన GO ను పది రోజులలో వెల్లడిస్తానన్నారు, అన్ని జిల్లా కేంద్రాల్లో బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి, స్థల సేకరణ చేయలాని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. బ్రాహ్మణ స్థితి గతులు ఏమిటో నాకు తెలుసునని అందుకోసం బ్రాహ్మణ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసే అంశం కూడా అలోచిస్తున్నానన్నారు. అలాగే ఆగమ పండితుల అభిప్రాయాలను, తెలంగాణ అర్చక సమాఖ్య సూచనలను పరిగణలోకి తీసుకుని ఫిబ్రవరిలో తెలంగాణ ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
     కేసీఆర్ను కలిసిన వారిలో అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, తెలంగాణ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నెంపల్లి జగన్మోహన్శర్మ , జిల్లా అధ్యక్షుడు ఏవీ సత్యమోహన్, గ్రేటర్ అధ్యక్షుడు వల్లూరి పవన్ కుమార్, అర్చక సమాఖ్య రాష్ట్ర నాయకులు బండారు శేషగిరిరావు, పాలకుర్తి నర్సింహమూర్తి, టక్కర్స్ సత్యనారాయణశర్మ, యల్లంభట్ల సీతారామశాస్త్రి, గుమ్మడవల్లి గణేష్ తదితరులు ఉన్నారు.
    వల్లూరి పవన్ కుమార్                        
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ




No comments:

Post a Comment