తొలి ఏకాదశి, శయన ఏకాదశి ,
గోపద్మ వ్రతం
మన భరతభూమి పుణ్య భూమి. భక్తికి,
భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన
చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన
కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి
వొకటి. తొలి ఏకాదశి, ముక్కోటి
ఏకాదశి, భీష్మ ఏకాదశి అని
జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది.
ఆషాఢ మాస ఏకాదశి తొలి
ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా)
జరుపుకుంటారు. దీనినే "శయన ఏకాదశి, ప్రధమ
ఏకాదశి" అని కూడా అంటారు.
ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు
క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక
దీన్ని "శయన ఏకాదశి" అంటారు.
నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే,
ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ
భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు
పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి)
సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష
దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి
దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య
వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ
వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ
రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష
ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి
ద్వాదశి వరకు ఆచరించవలెనని మన
పురాణాలు చెబుతున్నాయి.
అసలు మన పంచాంగం ప్రకారం
నెలకు రెండు చొప్పున ఇరవై
నాలుగు(24) ఏకాదశులు వస్తాయి. చాంద్ర మానం ప్రకారం మూడు
సంవత్సరాల కొక సార అధిక
మాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవైఆరు ఏకాదశులు వస్తాయి. అన్నిటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి, వైకుంఠ
ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటాము.
ఏకాదశి అంటే పదకొండు అని
అర్థము. ఐతే, ఈ ఏకాదశి
విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించబడింది.
త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం
గురించి అనేక కథలు కూడా
మన పురాణాలలో వివరించబడిన సంగతి విదితమే.
అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని
ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు
చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో
ఆచరించిన వారు సమస్త వ్యధల
నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది.
తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు
మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, సంకల్పం వలన తన శరీరము
నుంచి ఒక కన్యకను జనింపజేసినట్లు
ఆమెనే "ఏకాదశి" అనీ, ఆమె మూడు
వరాలు...
1. సదా మీకు ప్రియముగా ఉండాలి.
2. అన్ని తిధులలోను ప్రముఖంగా ఉండి అందరిచే పూజింపబడాలి.
3. నా తిధి యందు భక్తితో
పూజించి ఉపవాసము చేసిన వారికి మోక్షము
లభించాలి.
అని కోరినట్లు ఎన్నో పురాణ కథలు
చెప్పబడి ఉన్నాయి.
మహా సాద్వీ అయిన సతీ సక్కుబాయి
ఈ శయన ఏకాదశి నాడే
మోక్ష ప్రాప్తి పొందిందని సంతులీలామృత పురాణంలో చెప్పబడింది. అందువల్లనే, ఆ రోజు పండరీపురంలో
వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.
ఈ 'తొలి ఏకాదశి' నాడు
"గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా
చెప్తారు.
ఈ గోమాత పూర్తిగా విరాట్
పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున
ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము
నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే
అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే!
సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన
పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ
వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు
ఉన్నాయి.
అట్టి గోమాత నివశించే గోశాలను
ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో
రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు
పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను
ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను
వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది.
అలా, గోపద్మవ్రతం చెయ్యాలి.
వల్లూరి పవన్ కుమార్
-బ్రాహ్మణ సంఘం గ్రేటర్
వరంగల్ శాఖ
No comments:
Post a Comment