ప్రొఫెసర్ కొత్తపల్లి జయ శంకర్ వర్దంతి
తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ (ఆగష్టు 6, 1934 - జూన్ 21, 2011) వరంగల్ జిల్లా ఆత్మకూరు (వరంగల్ జిల్లా) మండలం పెద్దాపూర్ (ఆత్మకూరు)
గ్రామశివారు అక్కంపేట లో జన్మించారు. తెలుగు,
ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న
జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం
చేసి ఆజన్మ బ్రహ్మచారి గా
జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్డి పట్టా పొంది,
ప్రిన్సిపాల్గా, రిజిష్ట్రార్గా
పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు
ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్
ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో
పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి ఏర్పాటులో
కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011, జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర
ఏర్పాటుకు ముందే మరణించారు.
బాల్యం
1934 , ఆగస్టు 6
న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట లో
జయశంకర్ జన్మించాడు. తల్లి మహాలక్ష్మి, తండ్రి
లక్ష్మీకాంత్రావు. ఆయనకు ముగ్గురు
అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. జయశంకర్ తల్లిదండ్రులకు రెండో సంతానం. సొంత
కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం
చేసి ఆజన్మ బ్రహ్మచారి గా
మిగిలిపోయాడు.
ఉద్యోగ జీవితం
బెనారస్, అలీగఢ్ విశ్వవిద్యాలయాలనుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశాడు. 1975 నుంచి
1979 వరకు వరంగల్ లోని సీకేఎం కళాశాల
ప్రిన్సిపాల్గా పనిచేశాడు. 1979 నుంచి
1981 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్ రిజిస్ట్రార్గా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్శిటీకి
ఉపకులపతిగా పనిచేశాడు.
అధ్యాపకుడిగా..
అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి
మార్గనిర్దేశం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో
నూరిపోశారు. ఎమ్జన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు
ప్రిన్సిపల్గా పనిచేశారు. సీకేఎం
కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేంది. విప్లవకవి వరవరరావు లాంటి వాళ్లు ఆ
కాలేజీలో అధ్యాపకులుగా వ్యవహరించారు. ఎమ్జన్సీ గడ్డురోజుల్లో ఆయన కళాశాలను నడిపి
ఎంతో మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని
ఆయన నిర్బంధం నుంచి కాపాడారు. ఆయన
అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్సస్ స్కూల్లో మొదట తెలుగు బోధించారు.
ఒక అధ్యాపకున్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమే కానీ ఒక అధ్యాపకుడే
తన విద్యార్థుల్ని గుర్తుపెట్టుకొని పేరుపెట్టి పిలవడం ఒక్క జయశంకర్ సార్కే సాధ్యం అంటూ
ఆయనకు తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని,
ప్రముఖ సాహీతివేత్త రామశాస్త్రి కన్నీళ్లపర్యంతమయ్యారు. జయశంకర్ విద్యార్థుల్లో అనేక మంది దేశవిదేశాల్లో
ప్రస్తుతం ప్రముఖ స్థానంలో ఉన్నారు. వీరిలో కేయూ మాజీ ప్రొఫెసర్
ఎన్. లింగమూర్తి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ కే. సీతారామావు తదితరులు
అనేక మందికి ఆదర్శ గురువు జయశంకర్.
తెలంగాణా ఉద్యమంలో
1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1952 లో జయశంకర్ నాన్
ముల్కీ ఉద్యమంలో, సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో
పాల్గొన్నాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని
వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954 లో ఫజల్ అలీ
కమిషన్కు నివేదిక ఇచ్చాడు.
కె.సి.ఆర్ కు
సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించాడు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశాడు.
తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశాడు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని
తెలంగాణ కోసం అంకితం చేశాడు.
అబ్ తొ ఏక్ హీ
ఖ్వాయిష్ హై, వొ తెలంగాణ
దేఖ్నా ఔర్ మర్జానా' (ఇప్పుడైతే నాకు ఒకే కోరిక
మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి, తర్వాత మరణించాలి) అని అనేవాడు.
విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీదాకా,
ఢిల్లీ నుంచి అమెరికా దాకా
వ్యాప్తిచేయడంలో ఆయన పాత్ర మరవలేనిది.
విద్యార్థి దశ నుంచే తెలం’గానం’
ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు
జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల
తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోకి
ఉరికి ఆనా టి నుంచి
సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని
కాలంలోనే 1954 విశా లాంధ్ర ప్రతిపాదనను
ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సా ర్సీ
కమిషన్ ముందు హాజరై తెలంగాణ
వాణిని బలంగా వినిపించిన అపర
మేధావి కొత్తపల్లి జయశంకర్. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా
తెలంగాణకోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు. తెలంగాణ డిమాండ్ను 1969 నుంచి నిశితంగా అధ్యయనం
చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతీరోజూ రచనలు చేసిన అక్షరయావూతికుడు
ఆయన.
తెలంగాణలోని ప్రతీపల్లె ఆయన మాటతో పోరాట
గుత్ప అందుకున్నది. ఆయన తిరగని ప్రాంతం
లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం
లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద , విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ
రణన్నినాదాన్ని వినింపించిన పోరాట శీలి.
అస్తమయం
మీరు చేయాల్సింది మీరు చేశారు. ఈ
సమయంలో నేను ఇక్కడ ఇక
ఉండలేను. నేను వరంగల్కే
పోతాను. నన్ను పంపండి’ అంటూ ఆయన పుట్టిన
గడ్డమీద మమకారంతో వారం రోజుల క్రితం
ఇక్కడికి వచ్చారు. ఇంట్లోనే వైద్యులు ఆయనకు అన్నిరకాల వైద్యసేవలు
అందించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆయన పల్స్రేట్ పడిపోవడంతో ఆక్సిజన్
అందించారు.
మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు
అధికారం కావాలి. యాచక దశ నుంచి
శాసక దశకు తెలంగాణ రావాలి!
మా తెలంగాణ మాగ్గావాలి..!! యాభై ఏళ్లుగా ఇదే
ఆకాంక్ష.. ఇదే శ్వాస.. ఇదే
లక్ష్యం.. ఇదే జీవితం.. ఇందులోనే
మరణం! ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడు ప్రొఫెసర్ కొత్త పల్లి జయశంకర్
రెండేళ్లుగా గొంతు క్యాన్సర్తో
బాధపడుతూ.. 21.6.2011 మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment