వటసావిత్రి వ్రతం
సకల సౌభాగ్యాలను ప్రసాదించడంతో పాటూ వైధవ్యం నుంచి
కాపాడేవ్రతం - ‘వటసావిత్రీ వ్రతం’. దీనిని జ్యేష్ఠ శుధ్ధ పూర్ణిమనాడు ఆచరించాలి.
ఆ రోజు వీలుకాకపోతే జ్యేష్ఠబహుళ
అమావాస్యనాడు ఆచరించవచ్చు. పూర్వం నారద మహర్షి సావిత్రికి
ఈ వ్రతాన్ని గురించి వివరించినట్లు కథనం.
ఈ
వ్రతాచరణ వెనుక ఆసక్తికరమైన గాథ
ప్రచారంలో ఉంది. పూర్వం అశ్వపతి,
మాళవి దంపతులకు ‘సావిత్రి’ అనే కుమార్తె వుండేది.
యుక్తవయస్కురాలెైన సావిత్రికి నీకు ఇష్టమైనవాడిని వరించమని
తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. రాజ్యం శత్రువులపాలు కావడంతో అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తోన్న ద్యుమత్సేనుడి కుమారుడెైన సత్య వంతుని వివాహమాడతానని
తల్లిదండ్రులకు తెలిపింది. సత్య వంతుడి ఆయుష్షు
మరో సంవత్సరమేనని నారదుడు చెప్పినప్ప టికీ, సావిత్రి పట్టుపట్టడంతో
సత్యవంతుడితోనే వివాహం చేశా రు. మెట్టినింట
చేరి భర్త, అత్తమామలకు సేవ
చేయసాగింది. సత్యవంతుడు ఒకనాడు యజ్ఞ సమిధలు, పుష్పాలకోసం
అడ వికి బయలుదేరగా, సావిత్రీ
భర్తను అనుసరించింది. సమిధుల ను కోసి చెట్టు
దిగిన సత్యవంతుడు తలభారంతో సావిత్రి ఒడి లో తలపెట్టుకుని
పడుకున్నాడు. నారదుడు చెప్పిన సమయం ఆసన్నమైనదని సావిత్రి
గుర్తించింది. కొద్దిసేపటికి యముడు తన దూతలతో
వచ్చి సత్యవంతుడికి యమపాశం వేసి తీసుకుని పోసాగాడు.
సావిత్రి కూడ తన భర్తను
అనుసరించి వెళ్ళసాగిం ది. యముడు వారించినప్పటికీ
భర్త వెంటే తనకూ మార్గమని
చెప్పి వెళ్తూండడంతో ఆమె పతి భక్తిని
మెచ్చిన యముడు సావి త్రిని
వరం కోరుకోమన్నాడు.
‘మామగారికి
దృష్టి ప్రసాదించండి’ అని ఓ వరాన్ని
కోరింది, యముడు ప్రసాదించాడు. అయినా
సావిత్రి వెంట వస్తుండడంతో, యముడు
మరో వరాన్ని కోరుకోమన్నా డు. మామగారు పోగొట్టుకున్న
రాజ్యాన్ని తిరిగి ప్రసా దించమని కోరింది,
యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట
వస్తూండడంతో, ఆమె పతిభక్తిని మెచ్చి
మూడో వరం కోరుకోమనగా - ‘నేను
పుత్రులకు తల్లిని అయ్యేట్లు వరాన్ని ప్రసాదించండి’ అని కోరింది. యముడు
సావిత్రి పతిభక్తిని మెచ్చి ఆ వరాన్ని ప్రసాదించాడు.
సావిత్రి అడవిలో వటవృక్షం కింద ఉన్న భర్త
శరీరం వద్దకు చేరింది. భర్త లేచి కూర్చోగా,
వటవృక్షం వరకు పూజ చేసి
భర్తతో సహా రాజ్యానికి చేరినట్లు
కథ నం. వటవృక్షాన్ని, సావిత్రిని
పూజిస్తూ చేసి ‘వట సావిత్రి
వ్రతం’ అమల్లోకి వచ్చినట్లు పురాణ కథనం.
వ్రత విధానం
వ్రతాన్ని చేసే వారు ముందు
రోజు రాత్రి ఉపవాసం ఉం డాలి. వ్రతం
రోజు తెల్లవారుఝామునే నిద్రలేచి తలస్నా నం చేసి, ఇంటిని
శుభ్రపరిచి, దేవుడిని స్మరించుకుని, పూజావస్తువులను తీసుకుని వటవృక్షం (మర్రి) చెట్టు వద్దకు వెళ్ళి, చెట్టు మొదలు వద్ద అలికి
ముగుగ్లు వేసి, సావిత్రీ సత్యవంతులను
ప్రతిష్టించాలి. వారి చిత్రపటాలు దొరకపోతే
పసుపుతో చేసిన బొమ్మలనుగానీ ప్రతిష్టించు
కోవాలి.
మనువెైధవ్యాదిసకలదోషపరిహారార్థం
బ్రహ్మసావిత్రీ ప్రీత్యర్థం
సత్యవత్సావిత్రీ
ప్రీత్యర్థంచ వటసావిత్రీ వ్రతం కరిష్యే అనే
శ్లోకంతో సంకల్పించాలి.
చెప్ప వలసిన శ్లోకం:
వట మూలే స్తితో బ్రంహ
వట మధ్యే జనార్దనః వటాగ్రే
తు శివం విద్యాత్ సావిత్రివ్రత
సమ్యుత వట సిన్చామితే మూలం
సలిలైహి రంరుతోపయైహి ||
తర్వాత వినాయకుడు, సావిత్రీసత్యవంతులు, యమధర్మరాజు, బ్రహ్మదేవుడు, వటవృక్షాన్ని పూజించాలి. వట వృక్షమూలంతో బ్రహ్మ,
మధ్యభాగంలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉంటారు కనుక త్రిమూర్తులను పూజించిన
ఫలం కలుగుతుంది. పూజానంతరం ‘నమోవెైవస్వతాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ
వటవృక్షానికి దారాన్ని చుడుతూ, 108 ప్రదక్షిణలు చేసి నెైవేద్యం సమర్పిం
చడంతో పాటూ ముతె్తైదువులకు, బ్రాహ్మణుడికి
దక్షిణ తాంబూలాలను సమర్పించాలి. ఇలా మఱ్ఱిచెట్టు చుట్టూ
దారాన్ని చుట్టడం వల్ల మఱ్ఱి చెట్టు
యొక్క దీర్ఘాయుర్దాయంతో, తన భర్త ఆయుర్దాయాన్ని
బంధించినట్లవుతూ తన ఐదవతనం వర్థిల్లుతుందనేది
ప్రతి స్ర్తీమూర్తి కోరిక.
కొందరు స్ర్తీలు ఈపండుగను పూర్ణిమనాడు మాత్రం అనుసరిస్తుంటారు. మూడు రోజుల పాటు
ఈ పర్వాన్ని అనుసరించే స్ర్తీలు, త్రయోదశి ఉదయాన్నుంచి, పెైర్ణమి నాడు సాయంకాలం వరకు
ఉపవసిస్తారు. పూర్తిగా నిరాహారంగా ఉండలేని వారు నీళ్ళు, పాలు,
తేనీరు, పళ్ళు పుచ్చుకోవచ్చు.
అయితే ఈ వ్రతాన్ని మనదేశంలో
ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. కొంతమంది పూర్ణిమ నాటి మధ్యాహ్నం పురోహితునితో
సావిత్రి కథను చెప్పించుకుంటారు. పురోహితుని
ద్వారా కథను వింటే తప్ప
ఆ వ్రతానికి ఫలం దక్కదని కొంతమంది
నమ్మకం. ఇలా వటసావిత్రి వ్రతవిధానాన్ని
చేయవచ్చు.
వల్లూరి పవన్ కుమార్
-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment