కనుమ పండుగ
కనుమ
ను పశువుల పండుగ గా వ్యవహరిస్తారు.మూడవ రోజయిన కనుమ
వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు
ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా
నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను
జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతే కాదు, వనభోజనాలను
కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ
నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు,
ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ
అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు.
దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ
పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో
జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం
ఈ పండుగలోని రెండవ రోజయిన మకర్సంక్రాంతి లేదా లోరీ ని
మాత్రమే జరుపుకుంటారు.
పశువుల పండుగ
సంక్రాంతి వరసలో వచ్చే చివరి
పండగను కనుమ పండగ అంటారు
దీన్నె పశువులు పండగ అని కూడ
అంటారు. ఒక సంవత్సరం పాటు
తమ యజమానులకు వెట్టి చాకిరి చేసిన మూగజేవాలైన పశువులకు
ఈ రోజు పండుగే. తమిల్నాడు
చిత్తూరు జిల్లా లలో ఈ రోజున
"జల్లికట్టు" అని పశువులతో ప్రమాదకరమైన
విన్యాసాలు చేయిస్తారు. ఇది అటు పశువులకు
ఇటు మనుషులకు ప్రమాదకరం అయి నందున ప్రభుత్యం
దీన్ని నిషేదించింది. వివిద ప్రాంతాల్లో ఈ
పండగను వివిద పద్దతులతో జరుపు
కుంటుండొచ్చు . ముక్యంగా ఛిత్తూరు జిల్లా , అందులో పాకాల మండలం లోని
వల్లివేడు గ్రామ పరిసర అన్ని
పల్లెల్లొ ఈ పండగ జరుపుకొనుటలో
ఒక ప్రత్యేకత వున్నది. అందుకే ఈ వ్యాసం. ఇంకొన్ని
ప్రదేసాలలో కూ ఈ విధానం
అమల్లొ వుండొచ్చు. ఆ ప్రత్యేకత ఏమిటంటే?
ఆ రోజు ఇంటి కొకరు
చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి,
ఒక సంచి తీసుకొని సమీపంలో
ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ
దొరికే నానా రకాల వన
మూలికలు, ఔషద మొక్కలు, సేకరిస్తారు
.కొన్ని చెట్ల ఆకులు, కొన్ని
చెట్ల బెరుడులు , కొన్ని, చెట్ల పూలు, వేర్లు,
కాండాలు, గడ్డలు, ఇలా చాల సేకారిస్తారు.
కొన్ని నిర్ధుస్టమైన చెట్ల భాగాలను మాత్రమే
సెకరించాలి, అనగా, మద్ది మాను
, నేరేడి మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు,
మారేడు కాయ, ఇలా అనేక
మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి,
ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు
చేర్చి రోట్లో వేసి బాగా దంచు
తారు. అదంతా మెత్తటి పొడిలాగ
అవుతుంది. దీన్ని ఉప్పు చెక్క అంటారు
ఇది అత్యంత ఘాటైన మధుర మైన
వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక
పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు.
అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి
అందులొ ఈ ఉప్పు చెక్కను
చారెడు పోసి దాని నోరు
మూస్తారు. అప్పుడు ఆపశువు దాన్ని మీంగు తుంది.. ఇలా
ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ల
ఉప్పు చెక్కను తిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని
వాటంతటే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిస్తారు. ఏడాది కొకసారి ఈ
ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ
నివారణి అని వీరి నమ్మకం.
అది నిజమే కావచ్చు, ఎంచేతంటే
అందులో వున్నవన్ని, ఔషదాలు, వన మూలికలే గదా.
ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని,
చెరువుల వద్దకు గాని తోలుక పోయి,
స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి,
ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి
కొమ్ములను, పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి
రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు
వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి. మెడలో మువ్వల పట్టీలు,
మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు.
ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని
వదిలేస్తారు.
సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును
పునప్రతిస్టించి వూరులో ప్రతి ఇంటి నుండి
ఆడవారు కాటమరాజు ముందు పొంగిలి పెడ్తారు.
పొంగిలి అంటే కొత్త కుండలో,
కొత్తా బియ్యం,కొత్త బెల్లం వేసి
అన్నం వండడం. ఒక నెల ముందు
నుండే కాటమరాజు ముందు ఆ దారిన
వచ్చి పోయే ఊరి వారు
రోజుకొక కంపో, కర్రో తెచ్చి
అక్కడ కుప్పగా వేస్తారు. ఈ రోజుకు అది
ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని
"చిట్లా కుప్ప" అంటారు. చీకటి పడే సమయానికి
పొంగిళ్లు తయారయి వూంటాయి. ఊరి చాకలి కాటమరాజు
పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ
వేస్తారు. అనగా ప్రతి పొంగలి
నుండి కొంత తీసి అక్కడ
ఆకులో కుప్పగా పెడతారు, పూజానంతరం మొక్కున్న వారు, చాకిలి చేత
కోళ్లను కోయించు కుంటారు. అప్పటికి బాగా చీకటి పడి
వుంటుంది. అప్పటికి పశు కాపరు లందరూ
ఊరి పశువు లన్నింటిని అక్కడికి
తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని
పొంగలిని తీసి ఒక పెద్దముద్ద
గా చేసి అందులో సగం
పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి, తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి
లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి.. చెదర గొట్టతాడు. అవి
బెదిరి చేలెంబడి పరుగులు తీస్తాయి, ఆ సమయంలో పశువులను
బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలొ
వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను
అతని వీపు మీద కొడతాడు.
దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు
పరిగెడుతాడు .ఆ తర్వాత అందరు
అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని
చిట్లకుప్ప మంట వెలుగులో తమ
కోళ్లను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ల కెళతారు. ఈ
సందార్బంగా పెద్ద మొక్కున్న వారు
పొట్టేళ్లను కూడ బలి ఇస్తారు.
దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప
పెడతారు. దాన్ని" పొలి" అంటారు. ఆ "పొలి" ని తోటోడు గాని,
నీరు గట్టోడు గాని తీసుకొని పోయి
అందరి పొలాల్లో ,చెరువుల్లో, బావుల్లో "పొలో.... పొలి" అని అరువ్తు చల్లుతాడు.
అప్పడే కొత్త మొక్కులు కూడ
మొక్కు కుంటారు. అంటే, తమ పశు
మందలు అభివృద్ది చెందితే రాబోయే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు
కుంటారు .అప్పటికప్పుడే ఒక పొట్టేలి పిల్లను
ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల
పండగ పరిసమాప్తి అవుతుంది.
వల్లూరి పవన్ కుమార్
-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్
శాఖ
No comments:
Post a Comment