Wednesday, 5 November 2014

కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్థూ పటించాల్సిన శ్లోకం



కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్థూ పటించాల్సిన శ్లోకం
అన్ని దానాలు ఒక ఎత్తు. అయితే దీపదానం ఒక్కటీ ఒక ఎత్తు. దీపదానం చేసేవారు పైడి ప్రత్తితో స్వయంగా వత్తులను తయారుచేసుకుని వరిపిండిలేదా గోధుమ పిండితోగానీ ప్రమిదను చేసుకుని అందులో ఆవునెయ్యితో దీపమును వెలిగించి, దానికి నమస్కరించి కార్తీక సోమవారంనాడు లేదా కార్తీక పూర్ణిమనాడు వీలుకాకుంటే కార్తీక మాసంలో మరేరోజు అయినాసరే...నదీ తీరంలోగానీ, దేవాలయ ప్రాగణంలోగకానీ బ్రాహ్మణుడికి-
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగిః
భవన్తి నిత్యాంశ్చ పచాహి విప్రాః
 అనే శ్లోకం పఠిస్తూ దీపదానం చేయాలి. ఇలా కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం, దీపదానం చేయడంవల్ల సకల జీవరాశులు ముక్తిపొందుతాయని  పద్మ పురాణంచెప్తోంది.
 

  వల్లూరి పవన్ కుమార్                        

- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ

No comments:

Post a Comment