వినాయక చవితి
వినాయక చవితి భారతీయ పండుగలలో
ఒకటి. పార్వతీపరమేస్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. పురాణ గాధలలో
శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి మిన్నగా
ప్రకటించిన రోజు. వినాయకుని జ్ఞానానికి,
సంపత్తుకి మరియు మంచి అదృష్టానికి
దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడ,
లేక కొత్త పనులు చేపట్టేటప్పుడు
ప్రార్థించటం సర్వసాధారణం. ఈ పండుగ బాధ్రపద
మాసంలో శుక్ల చతుర్థి (చందమామ
వృద్ధిచెందే 4 వ రోజున) ప్రారంభమవుతుంది.
19 ఆగష్టు నుండి 15 సెప్టెంబరు మధ్యలో ఈ రోజు వుంటుంది.
ఈ పండుగ 10 రోజులపాటు అనంత చతుర్దశి (వృద్ధిచెందే
చందమామ 14 వ రోజున) ముగుస్తుంది.
వినాయక చవితి
సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని
కథ ఇలా చెప్పాడు.
పూర్వము గజ రూపము కల
రాక్షసుడొకడు పరమ శివుని కొరకు
ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి
భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి ?' అని
అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ!
నీవు ఎల్లప్పుడూ నా ఉదరము నందే
నివశించాలి' అని కోరాడు. శివుడు
అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివశించ సాగాడు.
కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి
చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్ధించి,
'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా
మీరే నా భర్తను యుక్తి
తో భస్మా సురుని బారి
నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఎదైనా
ఉపాయంతో, మహా శివుని కాపాడ
వలసింది' అని వేడుకుంది. శ్రీహరి
ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.
శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయాంగా
తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్య కారులుగా
మార్చి, గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!'
అనగా, విష్ణుమూర్తి 'ఇది మహమైన నందీశ్వరుడు.
శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న
శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు. వెంటనే
ఆ కోరిక కోరింది వేరెవరో
కాదు సాక్షాత్తూ శ్రీ మహవిష్ణువే అని
గ్రహించాడు. తనకిక మరణం తథ్యం
అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకమంతా
ఆరాధించ బడే టట్లు గా
అనుగ్రహించి, నా చర్మమును నీ
వస్త్రము గా ధరించమని' వేడు
కొన్నాడు.
అభయమిచ్చిన తరువాత, విష్ణు మూర్తి నందికి సైగ చేయగా, నంది
తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు
శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి 'ఇలా అపాత్ర దానం
చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది'
అని చెప్పి అంతర్థ
విఘ్నేశాధి పత్యము
ఒక రోజు దేవతలు, మునులు
పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి 'మాకు ఏ పని
చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని'
కోరారు.
ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ
పోటీ పడ్డారు. ఆ సమస్య పరిష్కరించడానికి
శివుడు, 'మీలో ఎవరైతే ముల్లోకముల
లోని అన్ని పుణ్య నదులలో
స్నానం చేసి ముందు వస్తారో
వాళ్లే ఈ పదవికి అర్హులు'
అన్నాడు. దానికి అంగీకరించిన కుమార స్వామి వెంటనే
తన నెమలి వాహనమెక్కి వెళ్లి
పోయాడు. గజాననుడు మాత్రం చిన్న బోయిన ముఖంతో
'తండ్రీ! నా బలాబలాలు తెలిసీ
మీరిలాంటి షరతు విధించటం సబబేనా
? నేను మీ పాద సేవకుడిని
కదా! నా మీద దయ
తలచి ఎదైనా తరుణోపాయం చెప్ప'మని కోరాడు. అంతట
శివుడు దయతో ఈ మంత్రం
చెప్పాడు.
'సకృన్ నారాయణే త్యుక్త్వా పుమాన్ కల్పశత త్రయం! గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక!'
కుమారా! ఇది నారాయణ మంత్రం!
ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు
పుణ్య నదులలో స్నానం చేసినట్టవుతుంది. షరతు విధించిందీ తండ్రే,
తరుణోపాయం చూపిందీ తండ్రే కాబట్టి, ఇంక తాను గెలవగలనో
లేదో, కుమార స్వామి తిరుగుతూ
ఉంటే నేను ఇక్కడే ఉండి
ఎలా గెలుస్తాను ? అని సందేహించకుండా, ఆ
మంత్రం మీద భక్తి శ్రద్ధలతో
జపించుచూ, మూడు మార్లు తల్లి
దండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసములోనే ఉండి
పోయాడు.
అక్కడ కుమార స్వామికి, మూడు
కోట్ల యాభై నదులలో, ఏ
నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం
చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు. అన్ని నదులూ
తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అన్నగారు, తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి,
'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఏదో
అన్నాను. నన్ను క్షమించి అన్నకు
ఆధిపత్యము ఇవ్వండీ అన్నాడు.'
ఆ విధంగా బాధ్రపద శుద్ధ చవితి రోజు
గజాననుడు, విఘ్నేశ్వరుడైనాడు. ఆ రోజు అన్ని
దేశాల లోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి
అనేక రకములైన పిండి వంటలు, కుడుములు,
టెంకాయలు, పాలు, తేనె, అరటి
పళ్లు, పానకము, వడ పప్పు సమర్పించారు.
విఘ్నేశ్వరుడు, తృప్తి పడి తిన్నంత తిని,
తన వాహనానికి పెట్టి, తీసుకెళ్ల గలిగినంత తీసుకుని భుక్తాయాసంతో చీకటి పడే వేళకు
కైలాసం చేరు కున్నాడు. ఎప్పటిలాగా
తల్లి దండ్రులకు వంగి నమస్కారం చేయబోతే
తన వల్ల కాలేదు. చేతులసలు
నేల కానితేనా ? పొట్ట వంగితేనా ? అలా
విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే, శివుని
శిరస్సుపై ఉన్న చంద్రుడు పక
పకా నవ్వాడు. చంద్రుని చూపు సోకి వినాయకుని
పొట్ట పగిలి కుడుములన్నీదొర్లు కుంటూ
బయటకు వచ్చేసాయి.
పార్వతీ దేవి దుఃఖించుచూ, చంద్రుని
ఇలా శపించింది. 'ఓరి పాపాత్ముడా! నీ
చూపు తగిలి నా కొడుకు
మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్లు, పాపాత్ములై
నీలాపనిందలు పొందుతారు.'
వినాయక జననము
కైలాసములో పార్వతీ దేవి శివుని రాక
గురించి విని, చాలా సంతోషించి,
తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ
నలుగుతో ఒక బాలుని రూపాన్ని
తయారు చేసి, ఆ బొమ్మకు
ప్రాణం పోసి ద్వారం వద్ద
కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ
వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ
పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర
వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం
వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదముగావించి లోపలికి
వెళ్లాడు.
అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి
చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది.
శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా
ద్వారం దగ్గర ఉన్న బాలుని
విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని
ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని
శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు.
అందువల్ల 'గజాననుడు'గా పేరు పొందాడు.
అతని వాహనము అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను
భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు.
కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి పుట్టాడు.
అతని వాహనము నెమలి. అతను మహా బలశాలి.
ఋషి పత్నులు నీలాప నిందలు పొందుట
ఆ సమయంలోనే సప్త ఋషులు యజ్ఞం
చేస్తూ తమ భార్యలతో అగ్నికి
ప్రదిక్షణాలు చేస్తున్నారు. అగ్ని దేవుడు ఆ
ఋషి పత్నులను చూసి మోహించాడు. కాని
ఋషుల శాపాలకు భయ పడ్డాడు. అతని
కోరిక గ్రహించిన అగ్ని దేవుని భార్య,
ఒక్క అరుంధతీ రూపము తప్ప మిగతా
అందరి రూపమూ ధరించి అతనికి
ప్రియం చేసింది. ఋషులది చూసి తమ భార్యలేనని
తలచి వాళ్లను వదిలి వే్సారు. దీనికి
కారణము, వారు చంద్రుని చూడటమే!
దేవతలు, మునులు వెళ్లి శ్రీ మహా విష్ణువుకు
విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి,
అసలు విషయం తెలుసు కుని
ఋషులకు వివరించి, వాళ్ల కోపం పోగొట్టాడు.
కైలాసమునకు వచ్చి విఘ్నేశ్వరుని పొట్టను
పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు. అప్పుడు దేవతలు మొదలగు వారంతా 'ఓ పార్వతీ! నీవిచ్చిన
శాపం వల్ల లోకానికే ముప్పు.
నీ శాపాన్ని ఉపసంహరించు' అన్నారు. పార్వతి కూడా తన కుమారుని
ముద్దాడి, 'ఏ రోజైతే చంద్రుడు
నా కుమారుడిని చూసి నవ్వాడో ఆ
రోజు చంద్రుని చూడ రాదు' అని
శాపోపశమనమును కలుగ చేసింది. ఆ
రోజు బాధ్రపద శుద్ధ చతుర్థి. ఆ
రోజు చంద్రుని చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు.
ఇలా కొన్నాళ్లు జరిగింది.
వినాయక నిమజ్జనం
బాధ్రపద శుద్ధ చవితి తరువాత
వినాయకుడికి నవరాత్రి పూజలు చెసిన తరువాత,
మట్టి వినాయకులను ఆడంబరముగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కాని
సముద్రములో కాని నిమజ్జనం చేస్తారు.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం వరంగల్
అర్బన్ శాఖ
No comments:
Post a Comment