వినాయక వ్రతకల్పం-పూజావిధానం
ఆచమ్య:
ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా
- ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ:
- విష్ణతే నమ: మధుసూదనాయ నమ:
- త్రివిక్రమాయ నమ: - వామనాయ నమ:
- శ్రీధరాయ నమ: - హృషీకేశాయ నమ:
- పద్మనాభాయ నమ: - దామోదరాయ నమ:
- సంకర్షణాయ నమ: - వాసుదేవాయ నమ:
- ప్రద్యుమ్నాయ నమ: - అనిరుద్ధాయ నమ:
- పురుషోత్తమాయ నమ: - అధోక్ష జాయ
నమ: - నారసింహాయ నమ: - అచ్యుతాయ నమ:
- జనార్దనాయ నమ: - ఉపేంద్రాయ నమ:
- హరమే నమ: - శ్రీ కృష్ణాయ
నమ:.
శ్లో!! శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే !!
వినాయక ప్రార్ధన:
సుముఖశ్చైకదంతశ్చ
కపిలో గజకర్ణక:
లంబోధరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప:
ధూమకేతు ర్గణాధ్యక్ష:, ఫాలచంద్రో గజానన:
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరమ్బ: స్కన్ద పూరజ:
షోడశైతాని నామాని య: పఠే చ్చ్రుణుయా
దపి,
విద్యారమ్బే విహహే చ ప్రవేశే
నిర్గమే తథా,
సజ్గ్రామే సర కార్యేషు విఘ్నస్తస్య
నజాయతే.
అభీప్సితార్ధసిద్ధ్యర్ధం
పూజితో యస్సు రైరపి,
సరవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమ: !!
కలశపూజ :
కలశం గంధపుష్పాక్షతై రాభ్యర్చ్య ( కలశానికి గంధపు బొట్లు పెట్టి,
అక్షతలు అద్ది, లోపల ఒఖ పుష్పాన్ని
వుంచి.. తదుపరి ఆ పాత్రను కుడి
చేతితో మూసి ఈ క్రింది
మంత్రాలను చదవాలి.)
కలశస్య ముఖే విష్ణు: కంఠే
రుద్ర స్సమాశ్రిత:
మూలే తత్ర స్థితో బ్రహ్మా
మధ్యేమాత్రుగణా: స్మృతా: !!
కుక్షౌతు సాగరా: సరే సప్తదీపా వసుంధరా
!
ఋగ్వేదో విథ యజుర్వేద: సామవేదో
అథర్వణ: !
అంగైశ్చ సహితా: సరే కలశాంబు సమాశ్రితా:
!!
ఆయాన్తు దేవ పూజార్ధం దురితక్షయకారకా:
!
గంగే చ యమునే చైవ
గోదావరి సరసతి !
నర్మదే సింధూకావేరి జలేవిస్మిన్ సన్నిధిం కురు !!
కలశోదకేన పూజాద్రవ్యాణి దేవమండప మాత్మానం చ సంప్రోక్ష్య.
(కలశమందలి జలమును చేతిలో పోసికొని, పూజకోఱకై, వస్తువులమీదను దేవుని మండపమునందును తన నెత్తిమీదను చల్లుకొనవలసినది.)
తదంగతేన వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే.
ప్రాణ ప్రతిష్ట :
మం !! అసునీతే పునరస్మాసు చక్షు:
పున: ప్రాణ మిహనో ధేహి
భోగమ్,
జ్యోక్సశ్యేమ సూర్య ముచ్చరంత
మనుమతే మృడయాన సస్తి.
అమృతం వై ప్రాణా అమృత
మాప: ప్రాణానేవ యథాస్థాన ముపహయతే.
సామిన్ సరజగన్నాథ యావత్పూజావసానకమ్ !
తావత్తం ప్రీతిభావేన బింబే విస్మిన్ సన్నిధిం
కురు !!
ఆవాహితో భవ, స్థాపితో భవ
, సుప్రసన్నో భవ , వరదో భవ,
అవకుంఠితో భవ ,
స్థిరాసనం కురు, ప్రసీద, ప్రసీద,
ప్రసీద.
పూజా విధానమ్ :
శ్లోకం: భవసంచితపాఫౌఘవిధంసనవిచక్షం !
విఘ్నాంధకార భాసంతం విఘ్నరాజ మహం భజే !!
ఏకదన్తం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్బుజం !
పాశాంకుశధరం దేవం ధాయే త్సిద్ధివినాయకమ్
!!
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం
!
భక్తాభీష్టప్రదం
తస్మా ద్ధ్యాయే త్తం విఘ్ననాయకమ్ !!
శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి.
శ్లోకం: అత్రా విగాచ్ఛ జగదంద్య
సురరాజార్చితేశర
అనాధనాధ సరజ్ఞ గౌరీగర్బసముద్భవ !!
శ్రీ వరసిద్ధి వినాయకం ఆవాహయామి.
శ్లోకం: మౌక్తికై: పుష్పరాగైశ్చ నానారత్నే రిరాజితం !
రత్నసింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్
!!
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆసనం సమర్పయామి.
శ్లోకం: గౌరీపుత్ర! నమస్తే విస్తు శంకర ప్రియనందన !
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్ష
తైర్యుతం !
శ్రీ వరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయామి.
శ్లోకం: గజవక్త్ర నమస్తేవిస్తు సరాభీష్టప్రదాయక !
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ దిరదానన !
శ్రీ వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి.
శ్లోకం: అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత !
గృహాణ విచమనం దేవ !తుభ్యం దత్తం
మయా ప్రభో
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆచమనీయం సమర్పయామి.
శ్లోకం: దధిక్షీర సమాయుక్తం మాధా హ్హ్యేన సమనితం
మధుపర్కం గృహాణేదం గజవక్త్య నమోవిస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి.
శ్లోకం: స్నానం పంచామృతై ర్దేవ గృహాణ గణనాయక
అనాధనాధ సరజ్ఞ గీరాణవరపూజిత !
శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృతస్నానం సమర్పయామి.
శ్లోకం: యా ఫలిని ర్యా
అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణి:
బృహస్పతి ప్రసూతా స్తానో ముంచన్తగ్ హస:
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఫలోధకేన సమర్పయామి.
శ్లోకం: గంగాది సరతీర్దేభ్య ఆహ్రుతై రమలైర్జలై :
స్నానం కురుష భగవ న్నుమాపుత్త్ర
నమోవిస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ శుద్దోదక స్నానం సమర్పయామి.
శ్లోకం: రక్తవస్త్రదయం చారు దేవయోగ్యం చ
మంగళం శుభప్రదం గృహాణ తం
లంబోదర హరాత్మజ శ్రీ వరసిద్ధి వినాయకాయ
వస్త్రయుగ్మం సమర్పయామి.
శ్లోకం: రాజతం బ్రహ్మసూత్రం చ
కాంచనం చోత్తరీయం గృహాణ దేవ సరజ్ఞ
భక్తానా
మిష్టదాయక శ్రీ వరసిద్ధి వినాయకాయ
యజ్ఞోపవీతం సమర్పయామి.
శ్లోకం: చందనాగురుకర్పూరకస్తూరీ కుంకుమానితం విలేపనం సురశ్రేష్ఠ !
ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్ శ్రీ వరసిద్ధి వినాయకం
గంధాన్ సమర్పయామి.
శ్లోకం: అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద
శంభుపుత్ర నమోవిస్తుతే శ్రీ వరసిద్ధి వినాయకాయ
అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి.
శ్లోకం: సుగన్ధాని చ పుష్పాణి జాజీకుందముఖానిచ
ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోవిస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ పుష్పై సమర్పయామి.
అథాంగ పూజా:
గణేశాయ నమ: పాదౌపూజయామి !!
ఏకదంతాయ నమ: గుల్పౌ పూజయామి
!!
శూర్పకర్ణాయ నమ: జానునీ పూజయామి
!!
విఘ్నరాజాయ నమ: జంఘే పూజయామి
!!
అఖువాహనాయా నమ: ఊరూ పూజయామి
!!
హేరంబాయ నమ: కటిం పూజయామి
!!
లంబోదరాయ నమ: ఉదరం పూజయామి
!!
గణనాథాయ నమ: హృదయం పూజయామి
!!
స్థూలకంఠాయ నమ: కంఠం పూజయామి
!!
స్కందాగ్రజాయ నమ: స్కంధౌ పూజయామి
!!
పాశహస్తాయ నమ: హస్తౌ పూజయామి
!!
గజవక్త్రాయ నమ: వక్త్రం పూజయామి
!!
శూర్పకర్ణాయ నమ: కర్ణౌ పూజయామి
!!
ఫాలచంద్రాయ నమ: లలాటం పూజయామి
!!
సరేశరాయ నమ: శిర: పూజయామి
!!
విఘ్నరాజాయ నమ: సరాణి అంగాని
పూజయామి !!
శ్రీ వినాయక వ్రత కథ
గణపతి జననము
సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను।
గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని
మెప్పించి కోరరాని వరము కోరినాడు।
తనను ఎవరూ వధించజాలని శక్తిని,
శివుడు తన ఉదరమునందే నివసించవలెనని
కోరినాడు। ఆ
ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ
అయినాడు। అతడు
అజేయుడైనాడు।
భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ
దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు
శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాదు।
నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు। గంగిరెద్దునాడించి
గజముఖాసురుని మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో"
అన్నాడు। విష్ణుదేవుని
వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని
కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు। శివుని
నందీశ్వరుని వశము చేయుమన్నాడు।
గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది। తనకు
అంత్యకాలము దాపురించినదని గుర్తించినాడు। అయినా
మాట తప్పుట కుదరదు। కుక్షియందున్న
శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున
నా జీవితము ముగియుచున్నది। నా
యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు,
నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది"
అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని
వశము చేశాడు। నందీశ్వరుడు
యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు। శివుడు
గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు।
అక్కడ పార్వతి భర్త రాకను గురించి
విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది। తనలో
తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో
ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది। అది
చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది। దానికీ
ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది। అంతకు
పూర్వమే ఆమె తన తండ్రియగు
పర్వత రాజు ద్వారా గణేశ
మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ
ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది। ఆ
దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి
వెళ్ళింది।
శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు
అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే
అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము
చేసి లోనికేగినాడు।
జరిగిన దానిని విని పార్వతి విలపించింది। శివుడు
చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని
శిరమును ఆ బాలుని మొండెమునకు
అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును,
త్రిలోకపూజనీయతను కలిగించినాడు। గణేశుడు
గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు। విగతజీవుడైన
గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని
వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి:
గణేశుడు అగ్రపూజనీయుడు
ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి
మాట ఏమిటి? ఈ గజాననునికి ఆ
స్థానము కలుగవలసి ఉంది। శివుని
రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును
కోరినాదు। శివుడు
ఇరువురికీ పోటీ పెట్టినాడు।
"మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ
స్నానాలు చేసి ముందుగా నావద్దకు
వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు। కుమారస్వామి
వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు।
గజాననుడుమిగిలిపోయినాడు। త్రిలోకముల
పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు
ఉపాయమర్థించినాడు। వినాయకుని
బుద్ది సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ
మంత్రమును అనుగ్రహించాడు। నారములు
అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు। అనగా
ఆ మంత్ర ఆధీనములు, మంత్ర
ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును
కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు। వినాయకునికే
ఆధిపత్యము లభించినది।
చంద్రుని పరిహాసం
గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ। ఈ
విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు।
(చంద్రుడుమనస్సుకు
సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు। ఆతని
మాన్యత నశించింది। నింద్యుడయినాడు। ఆతడిపట్ల
లోకము విముఖత వహించాలి। అనగా
అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో
నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు
అవుతారు। నిందలకు
గురియగుతారు।
చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా
శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట
ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి
విముక్తికై గణపతిదేవుని అర్థించినారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై
ఉపాయము సూచించినాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు తన
పూజచేసి తన కథను చెప్పుకొని
అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు
సాధ్యమగునని అనుగ్రహించినాడు.
ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడినది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము
ద్వారా మరింత స్పష్టము చేయబడినది.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం వరంగల్
అర్బన్ శాఖ