Saturday, 12 July 2014

సికింద్రాబాద్ ‌ ఉజ్జయినీ మహంకాళీ ( లష్కర్ ‌ బోనాలు )

సికింద్రాబాద్ఉజ్జయినీ మహంకాళీ  ( లష్కర్బోనాలు ) ఆషాడ మాసం రెండో ఆదివారం .
ఏడో నిజాం కాలం నుండి సికింద్రాబాద్మహంకాళీ అమ్మవారి దేవాలయంలో బోనాలపండుగ ఘనంగా జరిగేది . ముస్లింలు కూడా పాల్గొనే పండుగ మత సామరస్యానికి ప్రతీక !
ఇప్పటికి నగరంలో చిన్నా పెద్దా దేవాలయాలు కలిపి మూడు నాలుగు వందల దేవాలయాలలో బోనాల జాతరలో కొన్ని లక్షల మంది పాల్గొంటారు .
లాల్దర్వాజా సింహవాహినీ శ్రీమహంకాళీ దేవాలయానికి ఒక ప్రత్యేకత వుంది . సింహవాహిసీ శ్రీమహంకాళీ దేవాలయానికి వందేళ్ల పైగా చరిత్ర వుందంటారు . అమ్మవారు మహామహిమా న్వితగా భక్తులు కొలుస్తారు . ఇక్కడ జరిగే బోనాల జాతరను తిలకించ డానికి తెలంగాణా జిల్లాల నుండే కాక ఇతర ప్రాంతాలైన మహారాష్ట్ర , కర్ణాటక , తమిళనాడు నుండి కూడా భక్తులు తరలివస్తారు .
తలుగు వారి సంస్కృతి వైభవానికి బోనాల పండుగ ఒక విజయకేతనం . ఇది తెలంగాణా ప్రత్యేకతను చాటే విశిష్ట పండుగ . పండుగైనా ఏదో ఒక సందర్భానికి ప్రతీకగా నిలిచిపోయి వుంటుంది . అలాగే బోనాల పండుగ కూడా . ఋతువులు మారే ఆషాడమాసంలో వర్షాలు ప్రారంభ మవుతాయి . వాతావరణంలో మార్పులు వస్తాయి . తద్వారా వ్యాధులు సంక్రమించేకాలం . ప్రాచీనకాలంలో ఋతువులో కలరా , ప్లేగు వ్యాధులు ఎక్కువగా వ్యాపిం చేవి . ఇప్పుడంత వైద్య సౌకర్యాలు లేని రోజులలో దేవతలను కొలిచేవారు .1813 సం || లో నగరంలో వేలాది మంది ప్లేగు వ్యాధి బారిన పడ్డప్పుడు మహంకాళీ దేవిని వేడుకోవటంతో వ్యాధి తగ్గు ముఖం పట్టిందని ఆనాటి ప్రజలు నమ్మారు . అప్పటి నుండినగరంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తు న్నారు .
ఏడో నిజాం కాలం నుండి సికింద్రాబాద్మహంకాళీ అమ్మవారి దేవాలయంలో బోనాలపండుగ ఘనంగా జరిగేది . పండుగలో ముస్లింలు కూడా పాల్గొనేవారని చెపుతున్నారు . ఇది మత సామరస్యానికి ప్రతీకనే కదా ! ఇప్పటికి నగరంలో చిన్నా పెద్దా దేవాలయాలు కలిపి మూడు నాలుగు వందల దేవాలయాలలో బోనాల జాతర జరుగుతుంది . కొన్ని లక్షల మంది భక్తితో దీనిలో పాల్గొంటారు . జంట నగరాల నుండే కాకుండా పరిసర ప్రాంతాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చి మహంకాళీ బోనాల జాతరలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు .
పండుగ జాతర మొదట గోల్కొండ కోటలో మొదలవుతుంది . మహోత్సవం ఈనెల 4 గోల్కొండ కోటలోని జగదాంబికా ఆలయంలో ప్రారంభమైంది . ఇది నెల రోజుల పాటు సాగుతుంది .
గోల్కొండ కోటలో మాతా జగదాంబికా ఆలయంలో అబుల్హసన్తానీషా కాలంలో ప్రధానమంత్రి సైనికాధి కారులుగా వున్న అక్కన్న మాదన్నల కాలంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లు చెపుతారు . నిజాం కాలంలో కూడా ఇక్కడ ప్రతి ఏటా బోనాల ఉత్సవాలు జరిగేవి .
ఆషాడ మాసం మొదటి గురువారం గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఉత్సవం ప్రారంభమవుతుంది . నెల రోజులపాటు జరిగే ఉత్సవాలు నగరంలోని వివిధ దేవాలయాలలో జరిగి చివరకు మళ్లి d గోల్కొండ కోటలో ముగుస్తాయి .
ఆషాడ మాసం రెండో ఆదివారం సికింద్రాబాద్ఉజ్జయినీ మహంకాళీ ( లష్కర్బోనాలు ) ఆలయంలోను , మూడవ ఆదివారం లాల్దర్వాజా సింహవాహినీ మహంకాళీ అమ్మవారి ఆలయం లోను జరుగుతాయి . వీటితోపాటు జంటనగరంలోని అన్ని దేవాలయాల లోను బోనాల సమర్పణ పూజలు జరుగుతాయి .
హరిబౌలీలోని అక్కన్నమాదన్న , శాలిబంబలోని ముత్యాలమ్మ , గౌలిపురాలోని కోట మైసమ్మ , సుల్తాన్షాహి నల్ల పోచమ్మ , ఉప్పుగూడ మహంకాళి , అలియాబాద్దర్బార్మైసమ్మ , మిర్ఆలం మండి మాతామహంకాళి , కార్వాన్దర్బార్మైసమ్మ , మేకల మండి నల్ల పోచమ్మ ఇలా అనేక దేవాలయాలలో బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది . నిజం చెప్పాలంటే ప్రతి చిన్న బస్తీలోనూ
కూడా బోనాల పండుగ ఎంతో వేడుకగా జరుగుతుంది . అక్కన్న మాదన్న దేవాలయంలో మహంకాళీ అమ్మవారిని వీధులలో ఊరేగిస్తారు . లాల్దర్వాజా సింహవాహినీ శ్రీమహంకాళీ దేవాల యానికి ఒక ప్రత్యేకత వుంది . సింహవాహిసీ శ్రీమహంకాళీ దేవాలయానికి వందేళ్ల పైగా చరిత్ర వుందంటారు . అమ్మవారు మహామహిమా న్వితగా భక్తులు కొలుస్తారు . ఇక్కడ జరిగే బోనాల జాతరను తిలకించ డానికి తెలంగాణా జిల్లాల నుండే కాక ఇతర ప్రాంతాలైన మహారాష్ట్ర , కర్ణాటక , తమిళనాడు నుండి కూడా భక్తులు తరలివస్తారని అంటారు . నిజాం ప్రభువులు నగర రక్షణ కోసం నగరం చుట్టూ పటిష్టమైన కుడ్యాన్ని నిర్మించారు . నగరానికి రాకపోకలకు వీలుగా అక్కడక్కడ దర్వాజాలు , కిటికీలు ఏర్పాటు చేసి అక్కడ శక్తి స్వరూపుణి అయిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు . అలాంటి దర్వాజాలలో లాల్దర్వాజా ఒకటి . ఇక్కడి దర్వాజాకు స్థానికులు పండగలకు ఎర్రని జాజు రంగు వేయడంతో లాల్దర్వాజా అనే పేరు వచ్చిందని అంటారు . లాల్దర్వాజా దగ్గర కూడా అమ్మవారి విగ్రహం వుండేది . అమ్మవారికి నిజాం నవాబు పూజలు చేసాడని అంటారు . 1908 సం || లో మూసీనదికి వరదలు వచ్చి నగరం అతలా కుతలం అయినప్పుడు అప్పటి నిజాం నవాబు మీర్మహబూబ్ఆలీఖాన్అయోమయంతో పడ్డారు . అప్పటి ప్రధాని మహారాజా కిషన్ప్రసాద్సలహాకోరారు . ఆయనకు కూడా ఏం చెప్పాలో తోచక సంకట స్థితిని ఎదుర్కొన్నారు . వెంటనే ఒక ఆలోచన వచ్చింది . అమ్మవారికి ఆగ్ర హం కలిగితే ఇలాంటి ప్రళయం సంభవిస్తుందని , ఆమెను శాంతిప జేయడానికి పూజలు చేయాలని నిజాం ప్రభువుకు సూచించారు . మహారాజా కిషన్ప్రసాద్సలహామేరకు నిజాం నవాబు బంగారు చాటలో లాల్దర్వాజా మహంకాళీ అమ్మవారికి పసుపు , కుంకుమ , గాజులు , ముత్యాలు , పట్టు వస్త్రాలతో అమ్మ వారికి పూజ చేసారు .
అనంతరం ప్రాంతంలో స్థానికులు ఆలయాన్ని పునరుద్ధరించి 1968 సం || లో కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీ శంకచార్యులవారిచే విగ్రహ ప్రతిష్ఠ చేయించారు . మొదట్లో ఇక్కడ
కూడా బోనాల పండుగ సందర్భంగా జంతు బలులనిచ్చేవారు . అయితే 1953 నుండి జీవరక్షక ప్రచారమండలి సహకారంతో జంతుబలుల స్థానంలో గుమ్మడి కాయలను బలి ఇస్తున్నారు . బోనాల పండుగ సందర్భంగా మహంకాళీ దేవా లయంలో అమ్మ వారిని పురవీధుల్లో ఊరేగిస్తారు .
మొదటి రోజు పలహారం బండిని ఊరేగిస్తారు . రెండో రోజు రంగం ఉంటుంది . శివసత్తులూగే మహిళ భవిష్యద్వాణి వినిపిస్తుంది . బోనాల పండుగ సందర్భంగా జరిగే యాత్రలో పురుషులు పాల్గొంటారు . నృత్యాలు చేస్తారు . కన్నుల పండు గగా జరిగే బోనాల పండుగ జాతర చూసి తీర వలసిందే .
వల్లూరి పవన్ కుమార్    
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ  


No comments:

Post a Comment