సికింద్రాబాద్
ఉజ్జయినీ మహంకాళీ ( లష్కర్
బోనాలు ) ఆషాడ మాసం రెండో
ఆదివారం .
ఏడో నిజాం కాలం నుండి
సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారి దేవాలయంలో బోనాలపండుగ ఘనంగా జరిగేది . ముస్లింలు
కూడా పాల్గొనే ఈ పండుగ మత
సామరస్యానికి ప్రతీక !
ఇప్పటికి
నగరంలో చిన్నా పెద్దా దేవాలయాలు కలిపి మూడు నాలుగు
వందల దేవాలయాలలో ఈ బోనాల జాతరలో
కొన్ని లక్షల మంది పాల్గొంటారు .
లాల్ దర్వాజా సింహవాహినీ శ్రీమహంకాళీ దేవాలయానికి ఒక ప్రత్యేకత వుంది .
ఈ సింహవాహిసీ శ్రీమహంకాళీ దేవాలయానికి వందేళ్ల పైగా చరిత్ర వుందంటారు .
ఈ అమ్మవారు మహామహిమా న్వితగా భక్తులు కొలుస్తారు . ఇక్కడ జరిగే బోనాల
జాతరను తిలకించ డానికి తెలంగాణా జిల్లాల నుండే కాక ఇతర
ప్రాంతాలైన మహారాష్ట్ర , కర్ణాటక , తమిళనాడు నుండి కూడా భక్తులు
తరలివస్తారు .
తలుగు
వారి సంస్కృతి వైభవానికి బోనాల పండుగ ఒక
విజయకేతనం . ఇది తెలంగాణా ప్రత్యేకతను
చాటే విశిష్ట పండుగ . పండుగైనా ఏదో ఒక సందర్భానికి
ప్రతీకగా నిలిచిపోయి వుంటుంది . అలాగే ఈ బోనాల
పండుగ కూడా . ఋతువులు మారే
ఈ ఆషాడమాసంలో వర్షాలు ప్రారంభ మవుతాయి . వాతావరణంలో మార్పులు వస్తాయి . తద్వారా వ్యాధులు సంక్రమించేకాలం . ప్రాచీనకాలంలో ఈ ఋతువులో కలరా ,
ప్లేగు వ్యాధులు ఎక్కువగా వ్యాపిం చేవి . ఇప్పుడంత వైద్య
సౌకర్యాలు లేని ఆ రోజులలో
దేవతలను కొలిచేవారు .1813 సం || లో నగరంలో
వేలాది మంది ప్లేగు వ్యాధి
బారిన పడ్డప్పుడు మహంకాళీ దేవిని వేడుకోవటంతో వ్యాధి తగ్గు ముఖం పట్టిందని
ఆనాటి ప్రజలు నమ్మారు . అప్పటి నుండినగరంలో ఈ బోనాల పండుగను
ఘనంగా నిర్వహిస్తు న్నారు .
ఏడో నిజాం కాలం నుండి
సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారి దేవాలయంలో బోనాలపండుగ ఘనంగా జరిగేది . ఈ
పండుగలో ముస్లింలు కూడా పాల్గొనేవారని చెపుతున్నారు .
ఇది మత సామరస్యానికి ప్రతీకనే
కదా ! ఇప్పటికి నగరంలో చిన్నా పెద్దా దేవాలయాలు కలిపి మూడు నాలుగు
వందల దేవాలయాలలో ఈ బోనాల జాతర
జరుగుతుంది . కొన్ని లక్షల మంది భక్తితో
దీనిలో పాల్గొంటారు . జంట నగరాల నుండే
కాకుండా పరిసర ప్రాంతాల నుండి
కూడా వేలాది మంది భక్తులు తరలి
వచ్చి మహంకాళీ బోనాల జాతరలో భక్తి
శ్రద్ధలతో పాల్గొంటారు .
ఈ పండుగ జాతర మొదట
గోల్కొండ కోటలో మొదలవుతుంది . ఈ
మహోత్సవం ఈనెల 4 న గోల్కొండ
కోటలోని జగదాంబికా ఆలయంలో ప్రారంభమైంది . ఇది నెల రోజుల
పాటు సాగుతుంది .
గోల్కొండ
కోటలో మాతా జగదాంబికా ఆలయంలో
అబుల్ హసన్ తానీషా కాలంలో
ప్రధానమంత్రి సైనికాధి కారులుగా వున్న అక్కన్న మాదన్నల
కాలంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లు
చెపుతారు . నిజాం కాలంలో కూడా
ఇక్కడ ప్రతి ఏటా బోనాల
ఉత్సవాలు జరిగేవి .
ఆషాడ
మాసం మొదటి గురువారం గోల్కొండ
కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది .
నెల రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు
నగరంలోని వివిధ దేవాలయాలలో జరిగి
చివరకు మళ్లి d గోల్కొండ కోటలో ముగుస్తాయి .
ఆషాడ
మాసం రెండో ఆదివారం సికింద్రాబాద్
ఉజ్జయినీ మహంకాళీ ( లష్కర్ బోనాలు ) ఆలయంలోను , మూడవ ఆదివారం లాల్ దర్వాజా సింహవాహినీ మహంకాళీ అమ్మవారి ఆలయం లోను జరుగుతాయి .
వీటితోపాటు జంటనగరంలోని అన్ని దేవాలయాల లోను
బోనాల సమర్పణ పూజలు జరుగుతాయి .
హరిబౌలీలోని
అక్కన్నమాదన్న , శాలిబంబలోని ముత్యాలమ్మ , గౌలిపురాలోని కోట మైసమ్మ , సుల్తాన్
షాహి నల్ల పోచమ్మ , ఉప్పుగూడ
మహంకాళి , అలియాబాద్ దర్బార్ మైసమ్మ , మిర్ ఆలం మండి
మాతామహంకాళి , కార్వాన్ దర్బార్ మైసమ్మ , మేకల మండి నల్ల
పోచమ్మ ఇలా అనేక దేవాలయాలలో
ఈ బోనాల పండుగ ఘనంగా
జరుగుతుంది . నిజం చెప్పాలంటే ప్రతి
చిన్న బస్తీలోనూ
కూడా
ఈ బోనాల పండుగ ఎంతో
వేడుకగా జరుగుతుంది . అక్కన్న మాదన్న దేవాలయంలో మహంకాళీ అమ్మవారిని వీధులలో ఊరేగిస్తారు . లాల్ దర్వాజా సింహవాహినీ
శ్రీమహంకాళీ దేవాల యానికి ఒక
ప్రత్యేకత వుంది . ఈ సింహవాహిసీ శ్రీమహంకాళీ
దేవాలయానికి వందేళ్ల పైగా చరిత్ర వుందంటారు .
ఈ అమ్మవారు మహామహిమా న్వితగా భక్తులు కొలుస్తారు . ఇక్కడ జరిగే బోనాల
జాతరను తిలకించ డానికి తెలంగాణా జిల్లాల నుండే కాక ఇతర
ప్రాంతాలైన మహారాష్ట్ర , కర్ణాటక , తమిళనాడు నుండి కూడా భక్తులు
తరలివస్తారని అంటారు . నిజాం ప్రభువులు నగర
రక్షణ కోసం నగరం చుట్టూ
పటిష్టమైన కుడ్యాన్ని నిర్మించారు . నగరానికి రాకపోకలకు వీలుగా అక్కడక్కడ దర్వాజాలు , కిటికీలు ఏర్పాటు చేసి అక్కడ శక్తి
స్వరూపుణి అయిన అమ్మవారి విగ్రహాన్ని
ప్రతిష్టించారు . అలాంటి దర్వాజాలలో లాల్ దర్వాజా ఒకటి .
ఇక్కడి దర్వాజాకు స్థానికులు పండగలకు ఎర్రని జాజు రంగు వేయడంతో
లాల్ దర్వాజా అనే పేరు వచ్చిందని
అంటారు . లాల్ దర్వాజా దగ్గర
కూడా అమ్మవారి విగ్రహం వుండేది . అమ్మవారికి నిజాం నవాబు పూజలు
చేసాడని అంటారు . 1908 సం || లో మూసీనదికి
వరదలు వచ్చి నగరం అతలా
కుతలం అయినప్పుడు అప్పటి నిజాం నవాబు మీర్
మహబూబ్ ఆలీఖాన్ అయోమయంతో పడ్డారు . అప్పటి ప్రధాని మహారాజా కిషన్ ప్రసాద్ సలహాకోరారు . ఆయనకు కూడా ఏం
చెప్పాలో తోచక సంకట స్థితిని
ఎదుర్కొన్నారు . వెంటనే ఒక ఆలోచన వచ్చింది .
అమ్మవారికి ఆగ్ర హం కలిగితే
ఇలాంటి ప్రళయం సంభవిస్తుందని , ఆమెను శాంతిప జేయడానికి
పూజలు చేయాలని నిజాం ప్రభువుకు సూచించారు .
మహారాజా కిషన్ ప్రసాద్ సలహామేరకు నిజాం నవాబు బంగారు
చాటలో లాల్ దర్వాజా మహంకాళీ
అమ్మవారికి పసుపు , కుంకుమ , గాజులు , ముత్యాలు , పట్టు వస్త్రాలతో అమ్మ
వారికి పూజ చేసారు .
అనంతరం
ఈ ప్రాంతంలో స్థానికులు ఆలయాన్ని పునరుద్ధరించి 1968 సం || లో కంచికామకోటి
పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీ శంకచార్యులవారిచే విగ్రహ ప్రతిష్ఠ చేయించారు . మొదట్లో ఇక్కడ
కూడా
బోనాల పండుగ సందర్భంగా జంతు
బలులనిచ్చేవారు . అయితే 1953 నుండి జీవరక్షక ప్రచారమండలి
సహకారంతో జంతుబలుల స్థానంలో గుమ్మడి కాయలను బలి ఇస్తున్నారు . ఈ
బోనాల పండుగ సందర్భంగా మహంకాళీ
దేవా లయంలో అమ్మ వారిని
పురవీధుల్లో ఊరేగిస్తారు .
మొదటి
రోజు పలహారం బండిని ఊరేగిస్తారు . రెండో రోజు రంగం
ఉంటుంది . శివసత్తులూగే మహిళ భవిష్యద్వాణి వినిపిస్తుంది .
బోనాల పండుగ సందర్భంగా జరిగే
యాత్రలో పురుషులు పాల్గొంటారు . నృత్యాలు చేస్తారు . కన్నుల పండు గగా జరిగే
ఈ బోనాల పండుగ జాతర
చూసి తీర వలసిందే .
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment