అక్షయ తృతీయ నాడు ఎలాంటి
శుభకార్యాలు చేయాలో తెలుసా?
"అక్షయ తృతీయ" నాడు చేయాల్సిన శుభకార్యాలు..!
వైశాఖ శుద్ధ తృతీయ నాడు
కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ
తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. ఇంకా "అక్షయ తృతీయ" నాడే
మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు
జన్మించాడని పురాణాలు చెబుతున్నారు.
అటువంటి పవిత్ర పర్వదినమైన "అక్షయ తృతీయ" ఏ
శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం
వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు.
ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు
బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను
చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను
చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు.
ఇంకా గృహ నిర్మాణం, ఇంటి
స్థలం కొనడం, బావి తవ్వడం వంటి
పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని
విశ్వాసం.
ఇదిలా ఉంటే అక్షయ తృతీయ
నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని
అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో,
ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం
ప్రాప్తిస్తుందని ప్రతీతి.
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment