ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం ఇదే మన శక్తి
-రాజకీయ పార్టీలను యాచించవద్దు, శాసించాలి
-ప్రశ్నిస్తే వర్తమానం, భవిష్యత్తు మనదే..
-బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ పిలుపు
-బ్రాహ్మణులను పార్టీలు గుర్తించడం లేదు
-సహస్రవిప్రగడప మంథనిలో ఆ వెలుగులేవి?
-పురోహితులు పట్టణాల బాట పట్టారు
-తెలంగాణలో 40 నియోజకవర్గాలలో బ్రాహ్మణుల ఆధిపత్యం
-బ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో సీఎల్ రాజం
హైదరాబాద్ : సమాజ సౌభాగ్యానికి, ఉన్నతికి సమస్త శక్తులను ధారపోసిన బ్రాహ్మణులను రాజకీయ పార్టీలు తగిన రీతిలో గుర్తించటం లేదని బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు రేపటి ఎన్నికలలో కచ్చితంగా బ్రాహ్మణులకు జనాభా దామాషాలో ప్రాధాన్యం కల్పించాల్సిందేనని డిమాండ్ చేసింది. ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం అనే శక్తితో వర్తమాన రాజకీయ సమాజాన్ని ప్రశ్నించటానికి బ్రాహ్మణులు సిద్ధంగా ఉన్నారని సభ స్పష్టం చేసింది.
బ్రాహ్మణులందరూ ఐక్యమై, సంఘటితంగా రాజకీయ పార్టీలను శాసించాలని, యాచించడం ద్వారా కాకుండా రాజకీయ పార్టీలను శాసించే విధంగా బ్రాహ్మణులు తమ శక్తులను, యుక్తులను ఉపయోగించాలని సభ పిలుపునిచ్చింది. బ్రాహ్మణుల రాజకీయ ఉనికిని చాటి చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేశామని నిర్వాహకులు స్పష్టం చేశారు. శనివారం బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికల నిర్వహణలో నిజాంకాలేజీ మైదానంలో బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ జరిగింది. జై బ్రాహ్మణ్, బ్రాహ్మణుల ఐక్యత వర్థిల్లాలి వంటి నినాదాలతో సభా స్థలి దద్దరిల్లింది. ఈ సభకు బ్రాహ్మణ సంఘాల చైర్మన్, నమస్తే తెలంగాణ సీఎండీ సీ లక్ష్మీరాజం అధ్యక్షత వహించారు. బ్రాహ్మణులందరినీ సీఎల్ రాజం, విజయరాజం సత్కరించారు. అదేవిధంగా బ్రాహ్మణసంఘాలు ఈ దంపతులను ఘనంగా సన్మానించాయి. వివిధ పార్టీలలో రాజకీయంగా కీలకస్థానాల్లో ఉన్న బ్రాహ్మణులు, రేపటి ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆశావహులు, వేదపండితులు, అర్చక సమాఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎల్ రాజం మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమకాలంలో 158 మందికి బ్రిటిష్ పాలకులు ఉరిశిక్ష వేయగా ఇందులో 50శాతం మంది బ్రాహ్మణులే దేశమాత దాస్యశృఖలాలను ఛేదించడానికి ఉరికంబాన్ని ఎక్కారని చెప్పారు. అండమాన్ జైలులో 500 మంది ఖైదీలు నరకయాతన అనుభవించగా అదు లో 260 మంది బ్రాహ్మణులు ఉండేవారని గుర్తు చేశారు.
త్యాగనిరతిలో, వితరణశీలతలో, ఉద్యమబావుటాను ఎగురవేయడంలో అగ్రభాగంలో ఉన్న బ్రాహ్మణులను, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకోసం ఉరికంబాలను ముద్దాడిన బ్రాహ్మణులను, బ్రాహ్మణ కుటుంబాలను రాజకీయ పార్టీలు పూర్తిగా విస్మరిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సహస్రవిప్రగడపగా భాసిల్లిన మంథనిలో ఆ వెలుగులు కనిపించటం లేదని, మంథని బ్రాహ్మణులు యాచకులవుతున్నారని విచారం వెలిబుచ్చారు. పురహితం కోరిన పురోహితులు పట్టణాల బాట పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, అర్ధాకలి వాళ్లని పట్టణాలకు తరిమికొట్టిందని పేర్కొన్నారు. అన్నసంతర్పణలు చేసిన అగ్రహారీకులు యాచకులయ్యారని ఆయన బ్రాహ్మణుల దైన్యస్థితిని విశదీకరించారు. తెలంగాణలోని 10వేల అర్చక కుటుంబాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయని రాజం ఘోషించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వాణిజ్యవేత్తలు, ఉన్నతస్థాయి అధికారుల్లో బ్రాహ్మణులదే అగ్రస్థానమైనప్పటికీ రాజకీయరంగంలో మాత్రం ప్రాతినిధ్యం లేదని అన్నారు. ఈ కారణాలన్నింటినీ విశ్లేషించుకొని, కర్తవ్యాన్ని నిర్వచించుకొని రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణలో 40 నియోజకవర్గాలలో బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువగా ఉన్నదన్న రాజం.. రాజకీయ పార్టీలు ఆయా నియోజకవర్గాలో బ్రాహ్మణులకు టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణుల, అర్చకుల సమస్యలకు నమస్తే తెలంగాణలో తప్పకుండా అవకాశం ఇస్తామని, కృష్ణా పత్రికలో బ్రాహ్మణులకు ముట్నూరి అవకాశం ఇచ్చినట్లుగా నమస్తే తెలంగాణ బ్రాహ్మణుల పక్షం ఉంటుందని హామీ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ డైరెక్టర్ విజయరాజం మాట్లాడుతూ బ్రాహ్మణులు ఐక్యతను చాటడం అద్భుతాలలో అద్భుతమని అభివర్ణించారు. నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులలో బ్రాహ్మణులు ఐక్యం కావడం గొప్ప విషయమని అన్నారు. రాజకీయంగా ఉనికి చాటేందుకు బ్రాహ్మణులు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఈ సభ నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆచారాలను, సంప్రదాయాలను, తపఃశక్తిని కొనసాగిస్తున్నందుననే విప్రులు శక్తిమంతులయ్యారని ఆమె అన్నారు. కాశ్మీరీ పండితులను ఊచకోత కోసిన నాటినుంచి బ్రాహ్మణులు ఆగ్రహంగానే ఉన్నారని, రాజకీయ ప్రాధాన్యంకోసం పరిశ్రమిస్తున్నారని చెప్పారు. బ్రాహ్మణులు తమ స్వార్థం కోసం, ధనార్జనకోసం టికెట్లు అడగటం లేదని, సర్వేజనాఃసుఖినోభవంతు అనే ఆర్యోక్తిని రాజకీయరంగంలో చాటి చెప్పటం కోసమే రాజకీయ వాటా అడుగుతున్నారని స్పష్టం చేశారు. వీరితో పాటు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేవీ రమణాచారి, సుధీశ్ రాంభొట్ల, మాజీ డీజీపీ అరవిందరావు, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్, జనక్ప్రసాద్, కటకం మృత్యుంజయ, ద్రోణంరాజు రవికుమార్, తులసీ శ్రీనివాస్, దర్శనమ్ వెంకటరమణశర్మ, గంగు ఉపేంద్రశర్మ, గంగు భానుమూర్తి, బాచుపల్లి సుధాకరశర్మ, సరస్వతీశర్మ, వాణి, జ్వాలా నరసింహారావు, గిడుగు రుద్రరాజు, మురళీ దేశ్పాండే తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ రాజకీయ ప్రశ్నలను సంధించడానికే బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ ఏర్పరచామని స్పష్టం చేశారు. ఈ బాధ్యతను తీసుకొని బ్రాహ్మణ ఐక్యతను చాటి చెప్పిన సీఎల్ రాజం అభినందనీయులని ప్రశంసించారు. టీఆర్ఎస్ ప్రకటించినట్లుగా రాజకీయ పార్టీలు బ్రాహ్మణులకు ఇచ్చే టికెట్ల వివరాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాజ్యాధికారం కావాలంటే అన్ని వర్గాలతో మమేకం కావాలి : శ్రీధర్బాబు
బ్రాహ్మణులకు రాజ్యాధికారం కావాలంటే ఇతర వర్గాలతో మమేకం కావాలని మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు పిలుపునిచ్చారు. బ్రాహ్మణుల ఆత్మగౌరవసభలో శ్రీధర్బాబు మాట్లాడుతూ బ్రాహ్మణ యువకులు సంఘసేవలో నిమగ్నమై ముందుకు వెళ్తే గొప్ప పదవులు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. నమస్తే తెలంగాణ సీఎండీ సీ లక్ష్మీరాజం సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని ఎదగలేదన్నారు. తెలివితో, జ్ఞానబుద్ధితో గొప్ప స్థాయికి వచ్చారని ప్రశంసించారు. రాజం స్ఫూర్తిగా యువత ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు సంస్కరణలు నేడు ఫలితాలను ఇస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పీవీవంటి వ్యక్తులను తయారు చేయాలనే ఉద్దేశంతో సీఎల్ రాజం ఈ ఆత్మగౌరవసభ ఏర్పాటు చేశారని కొనియాడారు. అర్చక సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రయోజనాలు చేకూర్చిందని చెప్పారు. భవిష్యత్లో అర్చకుల సంక్షేమానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని, పేద బ్రాహ్మణులను ఆదుకునే విషయంలో ముందుంటుందని చెప్పారు. బ్రాహ్మణ కులానికి చెందిన పూర్వీకులు మంచి బాట వేశారని, వారి బాటలో నడిస్తే బ్రాహ్మణులకు గౌరవం వస్తుందని అన్నారు. వారి సంకల్పమే నేటి ఆత్మగౌరవసభగా శ్రీధర్బాబు కొనియాడారు. ఐక్యతతో ముందుకు వెళ్తే బ్రాహ్మణులకు విజయం ఖాయమన్నారు.
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటింది బ్రాహ్మణులే: ఆర్ కృష్ణయ్య
భారతదేశ సాంస్కతిక ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత బ్రాహ్మణులదేనని టీడీపీ నాయకుడు ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. నాలుగువేల సంవత్సరాల క్రితమే బ్రాహ్మణులు అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్నారని చరిత్ర చెబుతోందని అన్నారు. బ్రాహ్మణుల శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీలులేదన్నారు. కులాల మధ్య అంతరాలు బ్రాహ్మణులు తెచ్చారన్నదీ అవాస్తవమని చెప్పారు. సమాజంలో అంతరించిపోతున్న మానవ విలువల అభ్యున్నతికి బ్రాహ్మణ సమాజం పాటుపడాలని కోరారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల అర్చకులు అర్ధాకలితో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. లోకహితాన్ని కోరే బ్రాహ్మణులకు రాజకీయంగా అన్ని పార్టీలు వాటా ఇవ్వాలన్నారు. సమాజానికి విజ్ఞాన వీచికలు అందించిన బ్రాహ్మణులకు సరైన ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చారు.
సమాజంలో 6% ఉన్న బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేసిన పార్టీలను రాబోయే ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ నాయకుడు సుధీష్ రాంభొట్ల పిలుపునిచ్చారు. జనాభా దామాషా ప్రకారం బ్రాహ్మణులకు అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణులు సమాజంలో మమేకమై ఉండటంతో రాజకీయ పార్టీలు ఆదరిస్తాయని అభిప్రాయపడ్డారు.
రాజం రాజ్యసభ సభ్యులైతే ఇక బ్రాహ్మణులకు భయంలేదు: పీవీ రాజేశ్వర్రావు
నమస్తే తెలంగాణ అధిపతి సీఎల్ రాజం రాజ్యసభ సభ్యుడు అవుతున్నారని, దీనివల్ల బ్రాహ్మణులకు అండ ఉండే అవకాశమున్నందున భయపడాల్సిన అవసరం లేదని మాజీ పార్లమెంటు సభ్యుడు పీవీ రాజేశ్వర్రావు అభిప్రాయపడ్డారు. పదవిలో ఉన్నా, లేకున్నా రాజంకు రాజ్యాధికారం కొనసాగించేందుకు సహకరిస్తానన్నారు. నిజాం కళాశాల చరిత్రలో ఇంత పెద్ద బ్రాహ్మణుల సభ జరుగడం ప్రథమమని చెప్పారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 16 సీట్లు బ్రాహ్మణులకు ఇచ్చారని, ప్రస్తుతం అవి నాలుగుకు తగ్గాయని అన్నారు. పీవీ నరసింహరావు దార్శనికతను ప్రతీ పార్టీ నేడు కొనియాడుతుంటే, కాంగ్రెస్ మాత్రం పీవీ గురించి ఆలోచించడం లేదన్నారు.
బ్రాహ్మణులు తలుచుకుంటే ఏ పార్టీనైనా సింహాసనం ఎక్కించగలగడమేగాకుండా దించగలరని మహా సహస్రవధాని గరికపాటి నరసింహారావు హెచ్చరించారు. రెండు రాష్ర్టాలను అభివృద్ధిపరిచే శక్తి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉందన్నారు. దేశాభివృద్ధిలో బ్రాహ్మణులు చేసిన త్యాగం సామాన్యమైనది కాదన్నారు. బ్రాహ్మణల జోలికొస్తే సినిమాల విషయంలో పద్మశ్రీలేకాకుండా పదవులు, ప్రాణాలు పోతాయని అభిప్రాయపడ్డారు. సూర్యచంద్రులను శాసించే శక్తి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉందని చెప్పారు. రాజ్యంగాన్ని వంద రకాలుగా భాషించగలమని అన్నారు. బ్రాహ్మణుల ఎన్నికల గుర్తు జంధ్యం, యజ్ఞోపవీతం కావాలని పిలుపునిచ్చారు. మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన పీవీ సమర్ధతను, ఉండవల్లివంటి వారి వాక్చాతుర్యాన్ని వాడుకుని వదిలివేశారని అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణుల తపోశక్తితో యువత భవితకు ఉజ్వల భవిష్యత్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
రాజం మాటల వ్యక్తి కాదు చేతల వ్యక్తి : కటకం మృత్యుంజయం
బ్రాహ్మణుల అభివృద్ధికాంక్షను మాటలకు పరిమితం చేయకుండా చేతల్లో చూపెడుతున్న వ్యక్తి సీఎల్ రాజం అని టీ పీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణులు వివిధ వేదికలపై రాజకీయాధికారం దక్కించుకునేలా కృషి చేయాలని సూచించారు. ఆత్మగౌరవసభతో ఆగిపోకుండా బ్రాహ్మణుల అభివృద్ధి కోసం సదస్సులు నిర్వహించి, చర్చ జరుపాలని అభిప్రాయపడ్డారు.
రాజ్యాధికారం కోసం బ్రాహ్మణులు తమ పౌరుషాన్ని చూపాలని వైఎస్సార్సీపీ నేత జనక్ప్రసాద్ అన్నారు. బ్రాహ్మణుల ఐక్యత కోసం సీఎల్ రాజం కృషి అభినందనీయమని కొనియాడారు. రాజకీయాల్లో బ్రాహ్మణులకు మెరుగ్గా రాణించే సత్తా ఉందన్నారు.
ధర్మాన్ని రక్షించే శక్తి బ్రాహ్మణులకే ఉంది: రాంచంద్రరావు
ధర్మాన్ని రక్షించే శక్తి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉందని బీజేపీ అధికార ప్రతినిధి రాంచంద్రరావు అభిప్రాయపడ్డారు. దేశ సంస్కృతిని కాపాడాలంటే బ్రాహ్మణుల వల్లే సాధ్యమవుతుందని అన్నారు. బ్రాహ్మణులకు రాజ్యాధికారం రావడంద్వారా వారి ప్రయోజనాలు నెరవేరడంతోపాటు, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు.
వల్లూరి పవన్ కుమార్
9246812727 9246752735
( బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ అద్యక్షులు )
-రాజకీయ పార్టీలను యాచించవద్దు, శాసించాలి
-ప్రశ్నిస్తే వర్తమానం, భవిష్యత్తు మనదే..
-బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ పిలుపు
-బ్రాహ్మణులను పార్టీలు గుర్తించడం లేదు
-సహస్రవిప్రగడప మంథనిలో ఆ వెలుగులేవి?
-పురోహితులు పట్టణాల బాట పట్టారు
-తెలంగాణలో 40 నియోజకవర్గాలలో బ్రాహ్మణుల ఆధిపత్యం
-బ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో సీఎల్ రాజం
హైదరాబాద్ : సమాజ సౌభాగ్యానికి, ఉన్నతికి సమస్త శక్తులను ధారపోసిన బ్రాహ్మణులను రాజకీయ పార్టీలు తగిన రీతిలో గుర్తించటం లేదని బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు రేపటి ఎన్నికలలో కచ్చితంగా బ్రాహ్మణులకు జనాభా దామాషాలో ప్రాధాన్యం కల్పించాల్సిందేనని డిమాండ్ చేసింది. ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం అనే శక్తితో వర్తమాన రాజకీయ సమాజాన్ని ప్రశ్నించటానికి బ్రాహ్మణులు సిద్ధంగా ఉన్నారని సభ స్పష్టం చేసింది.
బ్రాహ్మణులందరూ ఐక్యమై, సంఘటితంగా రాజకీయ పార్టీలను శాసించాలని, యాచించడం ద్వారా కాకుండా రాజకీయ పార్టీలను శాసించే విధంగా బ్రాహ్మణులు తమ శక్తులను, యుక్తులను ఉపయోగించాలని సభ పిలుపునిచ్చింది. బ్రాహ్మణుల రాజకీయ ఉనికిని చాటి చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేశామని నిర్వాహకులు స్పష్టం చేశారు. శనివారం బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికల నిర్వహణలో నిజాంకాలేజీ మైదానంలో బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ జరిగింది. జై బ్రాహ్మణ్, బ్రాహ్మణుల ఐక్యత వర్థిల్లాలి వంటి నినాదాలతో సభా స్థలి దద్దరిల్లింది. ఈ సభకు బ్రాహ్మణ సంఘాల చైర్మన్, నమస్తే తెలంగాణ సీఎండీ సీ లక్ష్మీరాజం అధ్యక్షత వహించారు. బ్రాహ్మణులందరినీ సీఎల్ రాజం, విజయరాజం సత్కరించారు. అదేవిధంగా బ్రాహ్మణసంఘాలు ఈ దంపతులను ఘనంగా సన్మానించాయి. వివిధ పార్టీలలో రాజకీయంగా కీలకస్థానాల్లో ఉన్న బ్రాహ్మణులు, రేపటి ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆశావహులు, వేదపండితులు, అర్చక సమాఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎల్ రాజం మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమకాలంలో 158 మందికి బ్రిటిష్ పాలకులు ఉరిశిక్ష వేయగా ఇందులో 50శాతం మంది బ్రాహ్మణులే దేశమాత దాస్యశృఖలాలను ఛేదించడానికి ఉరికంబాన్ని ఎక్కారని చెప్పారు. అండమాన్ జైలులో 500 మంది ఖైదీలు నరకయాతన అనుభవించగా అదు లో 260 మంది బ్రాహ్మణులు ఉండేవారని గుర్తు చేశారు.
త్యాగనిరతిలో, వితరణశీలతలో, ఉద్యమబావుటాను ఎగురవేయడంలో అగ్రభాగంలో ఉన్న బ్రాహ్మణులను, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకోసం ఉరికంబాలను ముద్దాడిన బ్రాహ్మణులను, బ్రాహ్మణ కుటుంబాలను రాజకీయ పార్టీలు పూర్తిగా విస్మరిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సహస్రవిప్రగడపగా భాసిల్లిన మంథనిలో ఆ వెలుగులు కనిపించటం లేదని, మంథని బ్రాహ్మణులు యాచకులవుతున్నారని విచారం వెలిబుచ్చారు. పురహితం కోరిన పురోహితులు పట్టణాల బాట పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, అర్ధాకలి వాళ్లని పట్టణాలకు తరిమికొట్టిందని పేర్కొన్నారు. అన్నసంతర్పణలు చేసిన అగ్రహారీకులు యాచకులయ్యారని ఆయన బ్రాహ్మణుల దైన్యస్థితిని విశదీకరించారు. తెలంగాణలోని 10వేల అర్చక కుటుంబాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయని రాజం ఘోషించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వాణిజ్యవేత్తలు, ఉన్నతస్థాయి అధికారుల్లో బ్రాహ్మణులదే అగ్రస్థానమైనప్పటికీ రాజకీయరంగంలో మాత్రం ప్రాతినిధ్యం లేదని అన్నారు. ఈ కారణాలన్నింటినీ విశ్లేషించుకొని, కర్తవ్యాన్ని నిర్వచించుకొని రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణలో 40 నియోజకవర్గాలలో బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువగా ఉన్నదన్న రాజం.. రాజకీయ పార్టీలు ఆయా నియోజకవర్గాలో బ్రాహ్మణులకు టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణుల, అర్చకుల సమస్యలకు నమస్తే తెలంగాణలో తప్పకుండా అవకాశం ఇస్తామని, కృష్ణా పత్రికలో బ్రాహ్మణులకు ముట్నూరి అవకాశం ఇచ్చినట్లుగా నమస్తే తెలంగాణ బ్రాహ్మణుల పక్షం ఉంటుందని హామీ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ డైరెక్టర్ విజయరాజం మాట్లాడుతూ బ్రాహ్మణులు ఐక్యతను చాటడం అద్భుతాలలో అద్భుతమని అభివర్ణించారు. నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులలో బ్రాహ్మణులు ఐక్యం కావడం గొప్ప విషయమని అన్నారు. రాజకీయంగా ఉనికి చాటేందుకు బ్రాహ్మణులు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఈ సభ నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆచారాలను, సంప్రదాయాలను, తపఃశక్తిని కొనసాగిస్తున్నందుననే విప్రులు శక్తిమంతులయ్యారని ఆమె అన్నారు. కాశ్మీరీ పండితులను ఊచకోత కోసిన నాటినుంచి బ్రాహ్మణులు ఆగ్రహంగానే ఉన్నారని, రాజకీయ ప్రాధాన్యంకోసం పరిశ్రమిస్తున్నారని చెప్పారు. బ్రాహ్మణులు తమ స్వార్థం కోసం, ధనార్జనకోసం టికెట్లు అడగటం లేదని, సర్వేజనాఃసుఖినోభవంతు అనే ఆర్యోక్తిని రాజకీయరంగంలో చాటి చెప్పటం కోసమే రాజకీయ వాటా అడుగుతున్నారని స్పష్టం చేశారు. వీరితో పాటు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేవీ రమణాచారి, సుధీశ్ రాంభొట్ల, మాజీ డీజీపీ అరవిందరావు, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్, జనక్ప్రసాద్, కటకం మృత్యుంజయ, ద్రోణంరాజు రవికుమార్, తులసీ శ్రీనివాస్, దర్శనమ్ వెంకటరమణశర్మ, గంగు ఉపేంద్రశర్మ, గంగు భానుమూర్తి, బాచుపల్లి సుధాకరశర్మ, సరస్వతీశర్మ, వాణి, జ్వాలా నరసింహారావు, గిడుగు రుద్రరాజు, మురళీ దేశ్పాండే తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ రాజకీయ ప్రశ్నలను సంధించడానికే బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ ఏర్పరచామని స్పష్టం చేశారు. ఈ బాధ్యతను తీసుకొని బ్రాహ్మణ ఐక్యతను చాటి చెప్పిన సీఎల్ రాజం అభినందనీయులని ప్రశంసించారు. టీఆర్ఎస్ ప్రకటించినట్లుగా రాజకీయ పార్టీలు బ్రాహ్మణులకు ఇచ్చే టికెట్ల వివరాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాజ్యాధికారం కావాలంటే అన్ని వర్గాలతో మమేకం కావాలి : శ్రీధర్బాబు
బ్రాహ్మణులకు రాజ్యాధికారం కావాలంటే ఇతర వర్గాలతో మమేకం కావాలని మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు పిలుపునిచ్చారు. బ్రాహ్మణుల ఆత్మగౌరవసభలో శ్రీధర్బాబు మాట్లాడుతూ బ్రాహ్మణ యువకులు సంఘసేవలో నిమగ్నమై ముందుకు వెళ్తే గొప్ప పదవులు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. నమస్తే తెలంగాణ సీఎండీ సీ లక్ష్మీరాజం సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని ఎదగలేదన్నారు. తెలివితో, జ్ఞానబుద్ధితో గొప్ప స్థాయికి వచ్చారని ప్రశంసించారు. రాజం స్ఫూర్తిగా యువత ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు సంస్కరణలు నేడు ఫలితాలను ఇస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పీవీవంటి వ్యక్తులను తయారు చేయాలనే ఉద్దేశంతో సీఎల్ రాజం ఈ ఆత్మగౌరవసభ ఏర్పాటు చేశారని కొనియాడారు. అర్చక సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రయోజనాలు చేకూర్చిందని చెప్పారు. భవిష్యత్లో అర్చకుల సంక్షేమానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని, పేద బ్రాహ్మణులను ఆదుకునే విషయంలో ముందుంటుందని చెప్పారు. బ్రాహ్మణ కులానికి చెందిన పూర్వీకులు మంచి బాట వేశారని, వారి బాటలో నడిస్తే బ్రాహ్మణులకు గౌరవం వస్తుందని అన్నారు. వారి సంకల్పమే నేటి ఆత్మగౌరవసభగా శ్రీధర్బాబు కొనియాడారు. ఐక్యతతో ముందుకు వెళ్తే బ్రాహ్మణులకు విజయం ఖాయమన్నారు.
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటింది బ్రాహ్మణులే: ఆర్ కృష్ణయ్య
భారతదేశ సాంస్కతిక ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత బ్రాహ్మణులదేనని టీడీపీ నాయకుడు ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. నాలుగువేల సంవత్సరాల క్రితమే బ్రాహ్మణులు అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్నారని చరిత్ర చెబుతోందని అన్నారు. బ్రాహ్మణుల శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీలులేదన్నారు. కులాల మధ్య అంతరాలు బ్రాహ్మణులు తెచ్చారన్నదీ అవాస్తవమని చెప్పారు. సమాజంలో అంతరించిపోతున్న మానవ విలువల అభ్యున్నతికి బ్రాహ్మణ సమాజం పాటుపడాలని కోరారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల అర్చకులు అర్ధాకలితో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. లోకహితాన్ని కోరే బ్రాహ్మణులకు రాజకీయంగా అన్ని పార్టీలు వాటా ఇవ్వాలన్నారు. సమాజానికి విజ్ఞాన వీచికలు అందించిన బ్రాహ్మణులకు సరైన ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చారు.
సమాజంలో 6% ఉన్న బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేసిన పార్టీలను రాబోయే ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ నాయకుడు సుధీష్ రాంభొట్ల పిలుపునిచ్చారు. జనాభా దామాషా ప్రకారం బ్రాహ్మణులకు అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణులు సమాజంలో మమేకమై ఉండటంతో రాజకీయ పార్టీలు ఆదరిస్తాయని అభిప్రాయపడ్డారు.
రాజం రాజ్యసభ సభ్యులైతే ఇక బ్రాహ్మణులకు భయంలేదు: పీవీ రాజేశ్వర్రావు
నమస్తే తెలంగాణ అధిపతి సీఎల్ రాజం రాజ్యసభ సభ్యుడు అవుతున్నారని, దీనివల్ల బ్రాహ్మణులకు అండ ఉండే అవకాశమున్నందున భయపడాల్సిన అవసరం లేదని మాజీ పార్లమెంటు సభ్యుడు పీవీ రాజేశ్వర్రావు అభిప్రాయపడ్డారు. పదవిలో ఉన్నా, లేకున్నా రాజంకు రాజ్యాధికారం కొనసాగించేందుకు సహకరిస్తానన్నారు. నిజాం కళాశాల చరిత్రలో ఇంత పెద్ద బ్రాహ్మణుల సభ జరుగడం ప్రథమమని చెప్పారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 16 సీట్లు బ్రాహ్మణులకు ఇచ్చారని, ప్రస్తుతం అవి నాలుగుకు తగ్గాయని అన్నారు. పీవీ నరసింహరావు దార్శనికతను ప్రతీ పార్టీ నేడు కొనియాడుతుంటే, కాంగ్రెస్ మాత్రం పీవీ గురించి ఆలోచించడం లేదన్నారు.
బ్రాహ్మణులు తలుచుకుంటే ఏ పార్టీనైనా సింహాసనం ఎక్కించగలగడమేగాకుండా దించగలరని మహా సహస్రవధాని గరికపాటి నరసింహారావు హెచ్చరించారు. రెండు రాష్ర్టాలను అభివృద్ధిపరిచే శక్తి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉందన్నారు. దేశాభివృద్ధిలో బ్రాహ్మణులు చేసిన త్యాగం సామాన్యమైనది కాదన్నారు. బ్రాహ్మణల జోలికొస్తే సినిమాల విషయంలో పద్మశ్రీలేకాకుండా పదవులు, ప్రాణాలు పోతాయని అభిప్రాయపడ్డారు. సూర్యచంద్రులను శాసించే శక్తి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉందని చెప్పారు. రాజ్యంగాన్ని వంద రకాలుగా భాషించగలమని అన్నారు. బ్రాహ్మణుల ఎన్నికల గుర్తు జంధ్యం, యజ్ఞోపవీతం కావాలని పిలుపునిచ్చారు. మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన పీవీ సమర్ధతను, ఉండవల్లివంటి వారి వాక్చాతుర్యాన్ని వాడుకుని వదిలివేశారని అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణుల తపోశక్తితో యువత భవితకు ఉజ్వల భవిష్యత్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
రాజం మాటల వ్యక్తి కాదు చేతల వ్యక్తి : కటకం మృత్యుంజయం
బ్రాహ్మణుల అభివృద్ధికాంక్షను మాటలకు పరిమితం చేయకుండా చేతల్లో చూపెడుతున్న వ్యక్తి సీఎల్ రాజం అని టీ పీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణులు వివిధ వేదికలపై రాజకీయాధికారం దక్కించుకునేలా కృషి చేయాలని సూచించారు. ఆత్మగౌరవసభతో ఆగిపోకుండా బ్రాహ్మణుల అభివృద్ధి కోసం సదస్సులు నిర్వహించి, చర్చ జరుపాలని అభిప్రాయపడ్డారు.
రాజ్యాధికారం కోసం బ్రాహ్మణులు తమ పౌరుషాన్ని చూపాలని వైఎస్సార్సీపీ నేత జనక్ప్రసాద్ అన్నారు. బ్రాహ్మణుల ఐక్యత కోసం సీఎల్ రాజం కృషి అభినందనీయమని కొనియాడారు. రాజకీయాల్లో బ్రాహ్మణులకు మెరుగ్గా రాణించే సత్తా ఉందన్నారు.
ధర్మాన్ని రక్షించే శక్తి బ్రాహ్మణులకే ఉంది: రాంచంద్రరావు
ధర్మాన్ని రక్షించే శక్తి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉందని బీజేపీ అధికార ప్రతినిధి రాంచంద్రరావు అభిప్రాయపడ్డారు. దేశ సంస్కృతిని కాపాడాలంటే బ్రాహ్మణుల వల్లే సాధ్యమవుతుందని అన్నారు. బ్రాహ్మణులకు రాజ్యాధికారం రావడంద్వారా వారి ప్రయోజనాలు నెరవేరడంతోపాటు, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు.
వల్లూరి పవన్ కుమార్
9246812727 9246752735
( బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ అద్యక్షులు )